E-Paper
Advertisement

Hyderabad : ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకే నిందితుడు!

Hyderabad : ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకే నిందితుడు!

Hyderabad : హైదరాబాద్‌ ప్రజాభవన్‌ వద్ద బీభత్సం సృష్టించిన కారు కేసులో నిందితుడు బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు సోహైల్‌గా గుర్తించారు పోలీసులు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టి.. కారు ఆగిన వెంటనే అక్కడ నుంచి సోహైల్‌ పరారైనట్లు వెల్లడించారు వెస్ట్‌జోన్‌ డీజీపీ విజయ్‌కుమార్‌. ఘటన సమయంలో కారులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు సోహైల్‌తో పాటు ఇద్దరు యువకులు, మరో ముగ్గురు యువతులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో సోహైల్‌ పరారీలో ఉండగా మిగితావారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

అయితే కారు ప్రమాదానికి కారణం తానేనని సోహైల్‌ ఇంట్లో డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి పోలీసు స్టేషన్‌ వెళ్లి చెప్పాడని.. ప్రజాభవన్‌ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన సమయంలో కారును తానే డ్రైవ్‌ చేసినట్లు చెప్పాడని తెలిపారు. పోలీసు విచారణలో అసలు కారు నడిపింది సోహైల్‌ అని తేల్చారు. పోలీసులను తప్పుదోవపట్టించేలా సోహైల్‌ ఇంట్లో పనిచేసే డ్రైవర్‌ ప్రయత్నించడాని తెలిపారు. గతంలో జూబ్లీహిల్స్‌లో కూడా ఇదే తరహా కేసు నమోదైందని..ఆ ప్రమాదంలో కూడా వీళ్లే ఉన్నట్లు అనుమానం ఉందని..ఈ విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

అదుపులోకి తీసుకున్న వారిని కోర్టులో హాజరుపరుస్తామని.. పరారీలో ఉన్న సోహైల్‌ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×