BigTV English

Hyderabad : ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకే నిందితుడు!

Hyderabad : ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకే నిందితుడు!

Hyderabad : హైదరాబాద్‌ ప్రజాభవన్‌ వద్ద బీభత్సం సృష్టించిన కారు కేసులో నిందితుడు బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు సోహైల్‌గా గుర్తించారు పోలీసులు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టి.. కారు ఆగిన వెంటనే అక్కడ నుంచి సోహైల్‌ పరారైనట్లు వెల్లడించారు వెస్ట్‌జోన్‌ డీజీపీ విజయ్‌కుమార్‌. ఘటన సమయంలో కారులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు సోహైల్‌తో పాటు ఇద్దరు యువకులు, మరో ముగ్గురు యువతులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో సోహైల్‌ పరారీలో ఉండగా మిగితావారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.


అయితే కారు ప్రమాదానికి కారణం తానేనని సోహైల్‌ ఇంట్లో డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి పోలీసు స్టేషన్‌ వెళ్లి చెప్పాడని.. ప్రజాభవన్‌ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన సమయంలో కారును తానే డ్రైవ్‌ చేసినట్లు చెప్పాడని తెలిపారు. పోలీసు విచారణలో అసలు కారు నడిపింది సోహైల్‌ అని తేల్చారు. పోలీసులను తప్పుదోవపట్టించేలా సోహైల్‌ ఇంట్లో పనిచేసే డ్రైవర్‌ ప్రయత్నించడాని తెలిపారు. గతంలో జూబ్లీహిల్స్‌లో కూడా ఇదే తరహా కేసు నమోదైందని..ఆ ప్రమాదంలో కూడా వీళ్లే ఉన్నట్లు అనుమానం ఉందని..ఈ విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

అదుపులోకి తీసుకున్న వారిని కోర్టులో హాజరుపరుస్తామని.. పరారీలో ఉన్న సోహైల్‌ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌.


Related News

Argentina News: ముగ్గురు యువతులు హత్య.. సోషల్‌మీడియాలో లైవ్, అసలేం జరిగింది?

Bhavani Devotees Accident: భవానీ భక్తులపై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

Hanuman Temple: హనుమాన్ ఆలయంలో చోరీ.. హుండీ పగలగొట్టి దోచుకెళ్లిన దొంగలు

Delhi Crime News: ఆగ్రాలో తెల్లవారుజామున చైతన్యానంద అరెస్ట్.. విద్యార్థులపై లైంగిక వేధింపులు

MP News: కజిన్ సిస్టర్‌తో భార్య సీక్రెట్ రొమాన్స్.. షాకైన భర్త, ఏం చెయ్యాలో తెలియక

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 33 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Big Stories

×