E-Paper
Advertisement

Honeytrap Apps: ఈ అమ్మాయిలు నిజం కాదు.. రాత్రివేళ జాగ్రత్త!

Honeytrap Apps: ఈ అమ్మాయిలు నిజం కాదు.. రాత్రివేళ జాగ్రత్త!
Advertisement

Honeytrap Apps: సోషల్ మీడియాలో యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న హనీట్రాప్, సెక్స్‌టార్షన్ మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. “ఒంటరిగా ఉన్నారా? అందమైన అమ్మాయిలతో సరదాగా మాట్లాడండి” అంటూ ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి వేదికల్లో వచ్చే ప్రకటనల వెనుక భారీ సైబర్ కుట్ర దాగి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ తీయటి మాటల వెనుక ఉన్నది అందమైన వ్యక్తులు కాదు.. మీ డబ్బును, పరువును నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చు అని విశ్లేషించారు.

నేరగాళ్లు యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని ఏఐ (AI) సాంకేతికతతో సృష్టించిన నకిలీ వీడియోలను వాడుతున్నారని సీపీ వెల్లడించారు. ఈ ప్రకటనల్లో కనిపించే ఆకర్షణీయమైన అమ్మాయిలు నిజం కాదని.. అవన్నీ కృత్రిమ మేధస్సుతో రూపొందించినవని గుర్తించాలని కోరారు. ఆకర్షణీయమైన లింక్ ద్వారా అపరిచిత డేటింగ్ లేదా వీడియో కాలింగ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే.. క్షణాల్లో మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ సమాచారం మొత్తం నేరగాళ్ల హస్తగతమవుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లోనే ఇటువంటి యాడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

ఈ మోసగాళ్ల అసలు వ్యూహం వీడియో కాల్స్‌తో మొదలవుతుందని సజ్జనార్ వివరించారు. బాధితులు వీడియో కాల్ చేయగానే.. అవతలి వైపు న్యూడ్ వీడియోలను ప్లే చేస్తూ.. స్క్రీన్‌పై ఉన్న బాధితుడి ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఆ దృశ్యాలను మార్ఫింగ్ చేసి.. బాధితుడి ఫోన్ లోని బంధుమిత్రులకు పంపిస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే.. బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి మోసపూరిత ప్రకటనలు ఇచ్చే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆన్‌లైన్‌లో ఎవరూ ఊరికే స్నేహితులు కారు అన్న నిజాన్ని గ్రహించాలని.. క్షణికావేశంలో గుర్తుతెలియని యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సీపీ హితవు పలికారు. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇటువంటి సైబర్ వలలో చిక్కుకుంటే.. పరువు పోతుందేమో అని భయపడి మౌనంగా ఉండవద్దని కోరారు. తక్షణమే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటమే అత్యంత కీలకమని.. ‘బీ అలర్ట్’ అంటూ సందేశమిచ్చారు.

Advertisement

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×