E-Paper
Advertisement

Cyber Crime: సైబర్ వలలో మాజీ డీజీపీ మనుమరాలు.. ఏకంగా రూ.1.2 కోట్లు ఖేల్‌ఖతం

Cyber Crime: సైబర్ వలలో మాజీ డీజీపీ మనుమరాలు.. ఏకంగా రూ.1.2 కోట్లు ఖేల్‌ఖతం
Advertisement

భాగ్య నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. ఈసారి ఏకంగా మాజీ డీజీపీ మనుమరాలు.. సుమారు 18 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న దొడ్ల దివ్యారెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. అత్యంత చాకచక్యంగా ఆమె పేరుతోనే వాట్సప్ డీపీని సృష్టించి.. ఆమె అకౌంటెంట్‌ను బురిడీ కొట్టించారు. కేవలం మెసేజ్‌ల ద్వారానే ఏకంగా రూ. 1.20 కోట్ల రూపాయలను కాజేశారు.

బాధితురాలు దొడ్ల దివ్యారెడ్డి ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఆమె దగ్గర పని చేసే అకౌంటెంట్‌కు అపరిచిత నంబర్ నుండి ఒక వాట్సప్ మెసేజ్ వచ్చింది. ఆ నంబర్‌కు దివ్యారెడ్డి ఫోటో ప్రొఫైల్ పిక్చర్‌గా ఉండటంతో అకౌంటెంట్ అది నిజంగానే తన యజమాని పంపిన సందేశమని భ్రమపడ్డారు. తాను ప్రస్తుతం ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని.. అత్యవసరంగా కొంత నగదు బదిలీ చేయాలని ఆ మెసేజ్ సారాంశం. ఫోన్ కాల్స్ చేయవద్దని.. కేవలం చాటింగ్ ద్వారానే సూచనలు ఇస్తున్నట్లు నేరగాడు నమ్మించాడు.

Advertisement

నేరగాడు పంపిన బ్యాంకు ఖాతా వివరాలను చూసిన అకౌంటెంట్.. తన యజమాని ఆదేశం మేరకు వెంటనే రూ. 1.20 కోట్లను ఆ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. కాసేపటి తర్వాత అసలు విషయం తెలుసుకున్న అకౌంటెంట్ షాక్‌కు గురయ్యాడు. దివ్యారెడ్డిని సంప్రదించగా తాను ఎలాంటి మెసేజ్ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో తాము సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నామని గ్రహించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

ఈ ఘటనపై సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు నమోదైంది. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు ఎక్కడి నుండి సందేశం పంపాడు.. నగదు ఏ బ్యాంకు ఖాతాలోకి వెళ్లిందనే కోణంలో అధికారులు విచారణ వేగవంతం చేశారు. ప్రముఖుల ఫోటోలను వాడి వాట్సప్ ద్వారా జరిగే ఇలాంటి మోసాల పట్ల ప్రజలు.. ముఖ్యంగా అకౌంటెంట్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు అడిగినప్పుడు నేరుగా ఫోన్ చేసి ధృవీకరించుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Advertisement

ALSO READ: Congress Party: కాంగ్రెస్‌లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏప్రిల్ టార్గెట్‌గా హైకమాండ్ ప్లాన్!

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×