PM Narendra Modi: రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో ఈ పర్యటన ఉండవచ్చని అధికారిక వర్గాల సమాచారం. ఈ పర్యటనలో రూ.వేల కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయడంతో పాటు, మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రధానంగా రైల్వే, జాతీయ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం, శంకుస్థాపనలు చేసే అవకాశమున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని పర్యటనను పురస్కరించుకుని రాజధాని హైదరాబాద్లో భారీ బహిరంగ సభను నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈ సభను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సభ ద్వారా రాబోయే ఎన్నికల దృష్ట్యా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని, కేంద్రం తెలంగాణకు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, తేదీలు ఈ నెలాఖరులోపు ఖరారయ్యే అవకాశాలున్నట్లు వినికిడి.
Also Read: Sri Satya Kissik Talks: ‘బీబీ జోడీ’లో సెల్ఫ్ ఎలిమినేషన్కు కారణమిదే!
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానం పార్టీ మారలేదని స్పీకర్ తీర్పునివ్వడాన్ని సవాల్ చేస్తూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తీర్పును క్వాష్ చేయాలని కోరారు. 2024లో ఎంపీగా దానం నాగేందర్ కాంగ్రెస్ తరుపున పోటీ పచేశారని, కాబట్టి ఎమ్మెల్యేగా దానం తీసుకున్న జీతాన్నిఇ వెనక్కి ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. కాగా దీనిపై ఈనెల 23న హైకోర్టు విచారణ చేపట్టనుంది.