CM Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటళ్లకు రేటింగ్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులకు సూచించారు. క్యూర్ పరిధిలో పుడ్ సేప్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.తీసుకోవాలన్నారు. హోటల్స్ లోని కిచెన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించాలన్నారు.తరచూ తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక మానిటరింగ్ వింగ్ ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు చేపట్టాలన్నారు.
సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. శానిటేషన్, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మున్సిపల్ అధికారులు మార్క్ చేసిన చోటనే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసేందుకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించాలన్నారు.
కోర్ అర్బన్ రీజియన్ లో ఉన్న అన్ని స్ట్రీట్ లైట్స్ కు ప్రత్యేక నెంబర్ ఇచ్చి డ్యాష్ బోర్డుకు కనెక్ట్ చేయాలన్నారు. టెక్నాలజీ ద్వారా సమస్య తలెత్తిన చోట వెంటనే పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఫైర్ సేఫ్టీ విషయంలో అడ్వాన్స్డ్ ఎక్విప్ మెంట్ వినియోగించాలన్నారు. నగరంలోని సిగ్నల్ జంక్షన్స్, సర్కిల్స్ లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలన్నారు. తొలుత కొన్ని ఏరియాలను గుర్తించి పైలట్ ప్రాజెక్టుగా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలన్నారు.
Also Read: Mystery movie OTT: విదేశీ మహిళ కోసం పడరాని పాట్లు… మెంటలెక్కించే ట్విస్టులున్న డిటెక్టివ్ థ్రిల్లర్