E-Paper
Advertisement

Hyderabad Drugs Case: పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్!

Hyderabad Drugs Case: పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్!

Hyderabad Drugs Case: హైదరాబాద్‌ పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం రేపింది. ఒక ప్రముఖ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ, పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం నగరంలో చర్చనీయాంశమైంది. పంజగుట్ట నాగార్జున సర్కిల్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు ఒకే కాలేజీలో చదువుతున్నారు. వీరి వద్ద నుంచి 10 గ్రాముల MDMA అనే నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి వ్యసనాల బారిన పడటం పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విద్యార్థులకు డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అవుతున్నాయి? వీరి వెనుక ఉన్న ప్రధాన నిందితులు ఎవరు? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, లేనిపక్షంలో వారి భవిష్యత్తు అంధకారమవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విద్యాసంస్థల సమీపంలో నిఘా మరింత కఠినతరం చేస్తామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.

ALSO READ:మేడారం జాతరలో ‘ఇప్పపువ్వు’ ఘుమఘుమలు.. భక్తులను మురిపిస్తున్న ఆరోగ్యకరమైన లడ్డు!

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×