E-Paper
Advertisement

Hyderabad Drugs Case: పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్!

Hyderabad Drugs Case: పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్!
Advertisement

Hyderabad Drugs Case: హైదరాబాద్‌ పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం రేపింది. ఒక ప్రముఖ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ, పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం నగరంలో చర్చనీయాంశమైంది. పంజగుట్ట నాగార్జున సర్కిల్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు ఒకే కాలేజీలో చదువుతున్నారు. వీరి వద్ద నుంచి 10 గ్రాముల MDMA అనే నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి వ్యసనాల బారిన పడటం పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఈ విద్యార్థులకు డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అవుతున్నాయి? వీరి వెనుక ఉన్న ప్రధాన నిందితులు ఎవరు? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, లేనిపక్షంలో వారి భవిష్యత్తు అంధకారమవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విద్యాసంస్థల సమీపంలో నిఘా మరింత కఠినతరం చేస్తామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.

ALSO READ:మేడారం జాతరలో ‘ఇప్పపువ్వు’ ఘుమఘుమలు.. భక్తులను మురిపిస్తున్న ఆరోగ్యకరమైన లడ్డు!

Advertisement

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×