Hyderabad Drugs Case: హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం రేపింది. ఒక ప్రముఖ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ, పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం నగరంలో చర్చనీయాంశమైంది. పంజగుట్ట నాగార్జున సర్కిల్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు ఒకే కాలేజీలో చదువుతున్నారు. వీరి వద్ద నుంచి 10 గ్రాముల MDMA అనే నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి వ్యసనాల బారిన పడటం పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విద్యార్థులకు డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అవుతున్నాయి? వీరి వెనుక ఉన్న ప్రధాన నిందితులు ఎవరు? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, లేనిపక్షంలో వారి భవిష్యత్తు అంధకారమవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విద్యాసంస్థల సమీపంలో నిఘా మరింత కఠినతరం చేస్తామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.
ALSO READ:మేడారం జాతరలో ‘ఇప్పపువ్వు’ ఘుమఘుమలు.. భక్తులను మురిపిస్తున్న ఆరోగ్యకరమైన లడ్డు!
పంజాగుట్ట లో ఒక కాలేజ్ లో డ్రగ్స్ కలకలం
డ్రగ్స్ తీసుకుంటూ పోలీస్ లకు పట్టుబడ్డ 5 గురు విద్యార్థులు
10 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం
పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
5 గురు విద్యార్థులు ఒకే కాలేజ్ కు చెందిన వారి గా గుర్తింపు pic.twitter.com/OF7M37uytH
— ChotaNews App (@ChotaNewsApp) January 25, 2026