BigTV English
Advertisement

Hyderabad: అయ్యప్ప మాల ధరించిన విద్యార్థి.. క్లాస్ రూంలోకి అనుమతించని స్కూల్ యాజమాన్యం

Hyderabad: అయ్యప్ప మాల ధరించిన విద్యార్థి.. క్లాస్ రూంలోకి అనుమతించని స్కూల్ యాజమాన్యం

Hyderabad: అయ్యప్ప మాల ధరించాడని స్కూల్ యాజమాన్యం 6వ తరగతి విద్యార్థిని క్లాస్ రూంలోపలికి అనుమతించలేదు. హైదరాబాద్ జీడిమెట్లలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాల వేసుకుంటే ఎందుకు అనుమతించరంటూ స్కూల్ ముందు విద్యార్థి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. స్కూల్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.


స్కూల్ వద్ద ఆందోళన

అయ్యప్ప మాల ధరించి స్కూల్ ఎందుకు రాకూడదని విద్యార్థి తల్లిదండ్రులు ప్రశ్నిస్తు్న్నారు. విద్యా్ర్థి సంఘాల నేతలు స్కూల్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి కుటుబ సభ్యులు, బంధువులు స్కూలు ముందు బైఠాయించారు. పోలీసులు వారికి సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లారు.

విజయవాడలో ఇలాంటి ఘటనే

ఏపీలోని విజయవాడలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భవానీపురం ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులోని ఓ ప్రైవేట్ స్కూల్ లో వివాదం నెలకొంది. 3, 5వ తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అయ్యప్ప స్వామి మాల ధరించి స్కూలుకు వచ్చారు. స్కూల్ యాజమాన్యం వారిని లోపలికి అనుమతించలేదు. మాల వేసుకుని పాఠశాలకు రాకూడదని యాజమాన్యం వారిని అడ్డుకుంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్ ప్రశ్నించారు. ప్రిన్సిపాల్ వారితో దురుసుగా ప్రవర్తించడంతో.. స్థానిక అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. స్వామి మాల వేసుకుంటే స్కూల్ లోపలికి అనుమతించమని ప్రిన్సిపాల్ చెప్పడంతో.. స్వాములకు, ప్రిన్సిపాల్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Also Read: Warangal Floods: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. వరంగల్ అతలాకుతలం

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కల్పించుకుని సర్దిచెప్పారు. స్కూల్ యాజమాన్యం తమ నిర్ణయంపై పునరాలోచన చేసేందుకు మూడు రోజుల సమయం ఇచ్చింది. ఈ ఘటనపై డీఈఓకి లేఖ రాశామని, అక్కడి నుంచి రిప్లై వస్తే విద్యార్థులు మాలలో స్కూల్ కు రావడానికి అనుమతించాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయం తీసుకుంటామని పాఠశాల యాజమాన్యం పోలీసులకు తెలిపింది. పోలీసుల హామీ మేరకు అయ్యప్ప స్వాములు ఆందోళన విరమించారు.

 

Related News

TG Govt Schools: గురుకుల, కేజీబీవీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పెండింగ్ బకాయిలు మొత్తం క్లియర్

Hydraa: రూ. 111 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా.. స్థానికులు హర్షం వ్యక్తం

Azharuddin: అజార్‌కు మంత్రి పదవి.. అందుకేనా!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీజేపీ పరిస్థితి ఏంటీ!

Fee reimbursement Scheme: ఫీజు రియంబర్స్‌మెంట్ వివాదం.. నవంబర్ 3 నుంచి ప్రైవేటు కళాశాలల బంద్?

Chamala Kiran Kumar Reddy: అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర: ఎంపీ చామల

Heavy Rains: తెలంగాణపై మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షం, రైతన్నలు జర జాగ్రత్త..!

Azharuddin Oath: రేపే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు, ఎందుకంటే?

Big Stories

×