E-Paper
Advertisement

Hyderabad News: గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలు.. ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు, ఆనందంలో బాధితులు

Hyderabad News: గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలు.. ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు, ఆనందంలో బాధితులు

Hyderabad News: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మరోసారి ఆక్రమణలను తొలగించింది హైడ్రా. గచ్చిబౌలిలోని FCI ఎంప్లాయిస్ కోపరేటింగ్ హౌసింగ్ సొసైటీ లేఔట్‌లో అక్రమ కట్టడాలు, అనుమతులు లేని షెడ్‌లను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇప్పటికే సంధ్య శ్రీధర్‌రావు అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. FCI బాధితులకు అండగా ఉండాలని హైడ్రాకు సూచన చేసింది.

గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలు కూల్చివేసిన హైడ్రా

ఈ నేపథ్యంలో సోమారం ఉదయం రంగంలోకి దిగింది హైడ్రా. ఉదయం ఆరుగంటల నుంచి కూల్చివేతలను మొదలుపెట్టింది. 6 జేసీబీలు, ఓ బాహుబలి మిషన్‌తో కలిసి కూల్చివేతలు మొదలుపెట్టింది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు నిర్వహించారు. 4 భారీ షెడ్లు, ఒక స్లాబ్ కన్‌స్ట్రక్షన్‌ను అక్రమంగా గుర్తించారు.

హైకోర్టు ఆర్డర్స్‌తో సంధ్య కన్వెన్షన్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తున్నారు అధికారులు. పార్కులు, రోడ్లలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు సంధ్య కన్వెన్షన్ శ్రీధర్‌రావు. దీంతో రోడ్లను, పార్కు స్థలాలను రీ స్టోర్ చేస్తున్నారు అధికారులు. 1980 లో 20 ఎకరాల్లో FCI ఎంప్లాయిస్ కోపరేటింగ్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేశారు.

న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి హైడ్రా

2015 లో శ్రీధర్‌రావు వాటిని ఆక్రమించారు. మొత్తం 20 ఎక‌రాల ప‌రిధిలో వేసిన లేఔట్‌లో 162 వ‌ర‌కు ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది.  దీనిపై బాధితులు హైకోర్టు తలుపు తట్టారు.  ఎక్కువ ప్లాట్లు తీసుకుని త‌మ‌ను భ‌య‌పెట్టి మిగ‌తావి సొంతం చేసుకోవాల‌ని సంధ్యా శ్రీ‌ధ‌ర‌రావు ప్ర‌య‌త్నించార‌ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ ప‌క్క‌నే మా ప్లాట్లు, పార్కుల స‌రిహ‌ద్దులు ఏమాత్రం ప‌ట్టించుకోకుండా నిర్మాణాలు చేప‌ట్టార‌ని వివరించారు.

ఓ ప్లాట్ ఓనర్‌పై దాడి చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టార‌ని పేర్కొన్నారు. అందుకు శ్రీ‌ధ‌ర్‌రావుకు సుప్రీంకోర్టు జరిమానా విధించిన విష‌యాన్ని కోర్టులో ప్రస్తావించారు. ఆయన చర్యల వల్ల తమ ప్లాట్లు చూడడానికి వీల్లేకుండా చేశారని పేర్కొన్నారు. ఒకానొక దశలో దాడులు చేసి తమను భయబ్రాంతులకు గురి చేశారని, చివరకు హైడ్రాను ఆశ్రయించామని బాధితులు తెలిపారు.

ALSO READ:  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా చిక్కిన బంగారం

హైకోర్టు తీర్పు మేరకు అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో నేలమట్టం చేస్తున్నారు అధికారులు. ఐదు పెద్ద బిల్డింగ్స్, 17 ఐరన్ స్ట్రాస్టర్స్ తొలగిస్తున్నారు.  గతంలో కూడా ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన సంగతి తెల్సిందే.

 

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×