BigTV English

CM Revanth Reddy: కాకతీయులు చంపిన సమ్మక్క సారక్కలవైపే ఉంటాను: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: కాకతీయులు చంపిన సమ్మక్క సారక్కలవైపే ఉంటాను: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Chit Chat: కాకతీయులను చంపిన సమ్మక్క సారక్కలవైపే ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజముద్ర నుంచి కాకతీయులు కళాతోరణం తొలగిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడితో పోరాడిన వీరవనితలు మేడారంలో కుంకుమ భరిణెలుగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాకిస్థాన్‌లా ఒక రోజు ముందే సంబురాలు నిర్వహించారన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పై కేసీఆర్ కు గౌరవం లేదని, అమరవీరులు అంటే కేసీఆర్‌కు ద్వేషమని అన్నారు. సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం. 2015లో అమరవీరుల స్థూపం కట్టాలని తానే మొదట డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నయీం కేసుపై చర్చ మొదలు కాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక లిక్కర్ బ్రాండ్లకు సంబంధించి 1508 కొత్త వాటికి పర్మిషన్ ఇచ్చాడి సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం మొదటి లక్ష్యం డ్రగ్స్‌ ఏరివేత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ నేతలకు ప్రత్యేక ఆహ్వానం పంపినట్లు సీఎం తెలిపారు.


బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని.. కేసీఆర్‌ను కాపాడటం కోసమే కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంపై సీబీఐ విచారణ అడుతున్నారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని.. కేవలం ఇంటరప్షన్ మాత్రమే ఉందన్నారు సీఎం. అవసరమైతే లాగ్ బుక్‌లను చూసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. ప్రతిపక్షాలు ఇందుకు సిద్ధంగా ఉన్నాయా అని ప్రశ్నించారు.

Also Read: ‘నేను రాను.. రాలేను..’ దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ డుమ్మా..

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో 9 నుంచి 12 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రెండు ఎమ్మెల్సీలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని గెలుచుకోనున్నట్లు తెలిపారు. అనుకున్న ఫలితాలు రాకపోతే రెండు గంటలు ఎక్కువ పని చేస్తానన్నారు సీఎం. ఇక టీపీసీసీ పదవి గురించి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన పదవీ కాలం ముగుస్తుందని, ప్రముఖ నాయకుడే కొత్త పీసీసీగా వస్తాడని స్పష్టం చేశారు.

Related News

TGSRTC Dasara Offer: బస్సెక్కితే బహుమతులు.. దసరాకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Weather News: నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక.. పిడుగులు పడే ఛాన్స్

Ganja Seized: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

CM Revanth Reddy: భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశం

Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ..

Telangana New Liquor Shop: తెలంగాణలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

Big Stories

×