E-Paper
Advertisement

గద్వాల్లో పట్టపగలే ఇసుక మాఫియా అరాచకం.. పట్టించుకోని అధికారులు..!

గద్వాల్లో పట్టపగలే ఇసుక మాఫియా అరాచకం.. పట్టించుకోని అధికారులు..!
Advertisement

Sand Mafia: స్వేచ్ఛ బ్యూరో:  గద్వాల జిల్లా కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుండి జోగుళాంబ గద్వాల జిల్లాకు టిప్పర్ల ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు.

పోలీసులు పట్టుకున్నా.. వదిలేశారా..?

విశ్వసనీయ సమాచారం ప్రకారం, రెండు రోజుల‌ క్రితం గద్వాలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక టిప్పర్‌ను పోలీసులు పట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, సదరు వాహనాన్ని ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలిపెట్టినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇది పోలీసుల తీరుపై అనేక అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Also Read: BRS తోక పార్టీ TRS.. కవిత కొత్త పార్టీపై సామ రామ్మోహన్ రెడ్డి సెటైర్లు

పగలు, రాత్రి తేడా లేకుండా దందా..

కర్నూల్, మంత్రాలయం మరియు రాయచూరు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున టిప్పర్లు పగలు, రాత్రి అనే తేడా లేకుండా జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నాయి. ఇంత బహిరంగంగా అక్రమ రవాణా జరుగుతున్నా.. జిల్లా మైనింగ్, రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రజా ధనం దుర్వినియోగం

Advertisement

అనుమతులు లేని ఇసుక రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడటమే కాకుండా, భారీ వాహనాల రాకపోకలతో పట్టణ రోడ్లు కూడా దెబ్బతింటున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: రాజకీయ నవశకం.. కల్వకుంట్ల కవిత పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు

Related News

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

Big Stories

Advertisement
×