E-Paper
Advertisement

Vande Bharat Sleeper Trains: తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్.. సికింద్రాబాద్ టు ముంబై

Vande Bharat Sleeper Trains: తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్.. సికింద్రాబాద్ టు ముంబై
Advertisement

First Vande bharat sleeper train launch update(Telugu news live): వందే భారత్ తొలి స్లీపర్ ట్రైన్‌ను వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు ఇండియన్ రైల్వే ప్లాన్ చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆగష్టులో పట్టాలు ఎక్కించాలని కసరత్తు చేస్తోంది.

దేశంలో తొలుత సికింద్రాబాద్ నుంచి ముంబై సిటీల మధ్య వందేభారత్ తొలి స్లీపర్ ట్రైన్‌ను నడిపాలని ఆలోచన చేస్తోంది. ముఖ్యమైన రద్దీ కావడం ఒకటైతే, మరొకటి ఈ రెండు నగరాల మధ్య ఇప్పటివరకు వందే భారత్ రైలు లేదు. దీంతో ఈ మార్గాన్ని రైల్వేశాఖ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్‌కు సూచన చేశారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే.. రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది.

Advertisement

మరోవైపు సికింద్రాబాద్- రాజ్‌కోట్‌ల ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నడుస్తోంది. దీన్ని గుజరాత్‌ లోని కచ్ వరకు పొడిగించాలని కోరుతున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందినవారు హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీనివల్ల ఇటు తెలంగాణకు అటు గుజరాత్ కచ్ ప్రాంత‌వాసులకు హెల్ప్ అవుతుందని అంటున్నారు.

ALSO READ: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల

Advertisement

ఇదిలాకాకుండా తిరుపతి-నిజామాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తోంది రాయలసీమ ఎక్స్‌ప్రెస్. అయితే నిజామాబాద్‌లో ప్లాట్ ఫాంలు ఖాళీ లేక ఈ రైలు బోధన్ వరకు వెళ్తోంది. ఈ రైలును బోధన్ వరకు పొడిగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమీక్షలో వీటి గురించి చర్చించారు. కాచిగూడ- బెంగుళూరు మధ్య 8 కోచ్‌లతో నడుస్తున్న వందే భారత్ ట్రైన్‌కు మాంచి డిమాండ్ ఉంది. దీన్ని 16 కోచ్‌లకు పెంచాలన్న డిమాండ్‌ను దక్షిణ మధ్య రైల్వే పరిశీస్తున్నట్లు తెలుస్తోంది. రేపో మాపో రైల్వే శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×