Gadwal Student: జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ దారణ ఘటన చోటు చేసుకుంది. గద్వాల జిల్లా మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి తరుణ్ అనే విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరుణ్ ఇంటర్ సెకండ్ ఇయర్ సంవత్సరం చదువుతున్నాడు.
అయితే తరుణ్ ను అందరి ముందు ఉపాధ్యాయులు అవమానించారని అందుకే నా కుమారడుడి చనపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసేకున్నాడని తల్లతండ్రుల వాపోయారు. ఆత్మహత్యకు ముందు తరుణ్ సూసైడ్ లెటర్ రాసాడు. లెక్చరర్ శిరీష వల్లే తను చనిపోతున్నట్టు లెటర్లో వెల్లడించాడు.
Also Read: అధికారంలోకి రాగానే హైడ్రాని బంగాళాఖాతంలో విసిరేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
సూసైడ్ నోట్తో ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొల్పింది. దీంతో కళాశాల వద్ద విద్యార్థులు, బంధువుల ఆందోళనకు దిగే అవకాశం ఉందని అధికారుల అనుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉపాధ్యాయుల ప్రవర్తనపై విచారణ జరపాలని కుటుంబ సభ్యులు పోలీసులును డిమాండ్ చేస్తున్నారు.
Also Read: అభిమానులకు లైఫ్టైమ్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్!