E-Paper
Advertisement

Medchal: మేడ్చల్ లో విషాదం.. ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. డీన్ ఏం చేశారు ?

Medchal: మేడ్చల్ లో విషాదం.. ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. డీన్ ఏం చేశారు ?
today news in telangana

Medchal latest news(Today news in telangana):

మేడ్చల్‌ జిల్లా ఫిర్జాదిగూడలో స్టూడెంట్ సూసైడ్‌ కలకలం రేపుతోంది. శ్రీచైతన్య కాలేజ్‌లో ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే.. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థిని వర్ష మృతదేహాన్ని మార్చురికి తరలించడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వర్షది ఆత్మహత్య కాదు.. హత్యేనని ఆరోపిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. కాలేజ్‌ యాజమాన్యం విద్యార్థిని ఉరి వేసుకుందని చెబుతోంటే.. అదంతా కట్టుకథేనని మండిపడుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వర్ష మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవు పేరుతో శ్రీచైతన్య డీన్‌ ఒత్తిడి చేశారని.. ఆ ప్రెజర్‌ తట్టుకోలేకనే సూసైడ్‌ చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాలేజ్‌ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వర్ష మృతికి డీన్‌ మమత బాధ్యత వహించాలని.. వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యం 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఘటనపై ఇంటర్మీడియట్‌ బోర్డు కమిటీ వేసి విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోపక్క వర్ష తమ వల్ల చనిపోలేదని.. తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతోనే.. మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుందని కాలేజ్‌ యాజమాన్యం చెబుతోంది.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×