E-Paper
Advertisement

Chandrababu Kuppam Tour: ఎన్నికలకు టీడీపీ సన్నాహాలు.. కుప్పంలో రెండోరోజు చంద్రబాబు పర్యటన..

Chandrababu Kuppam Tour: ఎన్నికలకు టీడీపీ సన్నాహాలు.. కుప్పంలో రెండోరోజు చంద్రబాబు పర్యటన..
Advertisement

Chandrababu Kuppam Tour: ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలనే ధ్యేయంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్ ని సమాయత్తం చేసే పనిలో పడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మూడురోజుల పాటు చంద్రబాబు పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం నాడు నియోజకవర్గంలోని గుడుపల్లెలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో స్థానికులు, టీడీపీ, జనసేన కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొని ఘనస్వాగతం పలికారు.

కాగా నేడు పర్యటనలో భాగంగా చంద్రబాబు.. ఉదయం 11.50 గంటలకు శాంతిపురం ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. అలానే మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పోలీస్‌ స్టేషన్‌ సెంటర్‌లో బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఇక సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు కుప్పంలోని ఎంఎం ఫంక్షన్‌ హాలులో జనసేన నేతలు, కార్యకర్తలతో సమీక్ష చేయనున్నారు. అనంతరం 6 గంటల 15 నిమిషాలకు బీసీఎన్‌ కన్వెన్షన్‌ హాలులో టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక చివరగా రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి కుప్పం ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌‌లో బస చేయనున్నారు.

Advertisement

అయితే గుడుపల్లె సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ సర్కారుపై ఫైర్ అయ్యారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. ఈ ముఖ్యమంత్రినే అంటూ ధ్వజమెత్తారు. వైసీపీ సినిమా అయిపోయిందని..ఆ పార్టీకి ఇక ఉన్నది వంద రోజులేనన్నారు. అరాచకాలు అన్నీ గుర్తున్నాయని.. వాటికి వడ్డీతో చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ఈ ప్రభుత్వంలో అంగన్ వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు రోడ్డెక్కారని.. అధికారంలోకి రాగానే ఇలాంటి చిరుద్యోగులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Big Stories

Advertisement
×