Nizamabad Police: నిజామాబాద్ జిల్లాలో అంతర్ రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగల ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు. దొంగతనాలకు పాల్పడుతున్న నిర్ణితులు, జైల్లో పరిచయమై ముఠాగా ఏర్పడ్డ దుండగులు ప్లాన్ ప్రకారం కాపర్ కాయిల్స్ దొంగతనాలకు పాల్పడ్డారు.కాపర్ కాయిల్స్ దొంగతనాలకు పాల్పడుతున్న ముదోల్, భైంసా కు చెందిన నిందితులను గుర్తించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పంట పొలాల ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేశారు నిందితులు. ఇక నిందితులు 10 మంది అంతర్ రాష్ట్రం దొంగలుగా గుర్తించారు పోలీసులు. నిందితులపై నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో 34 క్రిమినల్ కేసులు ఉన్నట్లు సీపీ సాయి చైతన్య వెల్లడించారు.
Also Read: Gurukul Ragging: కూల్డ్రింక్ చిచ్చు.. ప్రాణభయంతో ఐదుగురు విద్యార్థులు పరార్!
దొంగిలించిన కాపర్ కాయిల్స్ ను నగరంలోని హౌసింగ్ బోర్డు భద్రపరిచి విక్రయం చేసేవారని తెలిపారు. నిందితుల నుంచి 1.20 కిలోల కాపర్ కాయిల్స్, 2 లక్షల 75 వేల నగదు తో పాటు రెండు టూ వీలర్, ఒక ఆటో, దొంగతనం కు వాడిన హక్స బ్లేడ్లు, పని ముట్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి గురైన 10 క్వింటాళ్ల కాపర్ కాయిల్స్, నిందితుల్లో 7 గురు రిమాండ్, ముగ్గురు పరారీ అయినట్లు తెలిపారు. ఏసిపి ప్రకాష్ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లు యాదగిరి గౌడ్, రాజశేఖర్, గంగాధర్, సిబ్బంది నీ అభినందించిన సీపీ సాయి చైతన్య.
Also Read: Flight Services Resume: ప్రయాణీకులకు కాస్త రిలీఫ్, దుబాయ్ నుంచి ఇండియాకు విమాన సర్వీసులు ప్రారంభం!