BigTV English
Advertisement

Kaleshwaram: నేతల ఉక్కిరి బిక్కిరి..విచారణ ముందుకు హరీష్‌రావు, ఈటెల

Kaleshwaram: నేతల ఉక్కిరి బిక్కిరి..విచారణ ముందుకు హరీష్‌రావు, ఈటెల

Kaleshwaram: బీఆర్ఎస్‌కు ఈ ఏడాది కష్టాలు తప్పలేదు. ఒకటి తర్వాత మరొకటి ఆ పార్టీ కీలక నేతలను వెంటాడుతున్నాయి. ఫార్ములా ఈ రేసు కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు కేటీఆర్. రేపో మాపో హరీష్‌రావును విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీఆర్ఎస్ నేతల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.


బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైంది. రోజుకో కేసు తెరపైకి రావడంతో నేతలు బెంబేలెత్తుతున్నారు. లేటెస్ట్‌గా కాలేశ్వరం బ్యారేజ్‌లపై జస్టిస్ పీసీ ఘోష్ చేపట్టిన విచారణ క్లైమాక్స్ కు చేరుకుంది. తొలుత అధికారులను విచారించిన న్యాయవిచారణ కమిటీ, ఆ తర్వాత పైస్థాయి అధికారులు, ఇంజనీర్లు.. ఐఏఎస్‌ల వంతైంది.

ఇప్పుడు రాజకీయ నేతల వంతైంది. ఈనెల 19న హైదరాబాద్‌కు రానున్నారు జస్టిస్ పీసీ ఘోష్. గత ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిన ఈటెల, హరీష్ రావులను విచారణకు పిలిచే అవకాశ మున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మించిన కంపెనీ ప్రతినిధులు, ఇంజనీర్లు, అధికారుల సేకరించిన సమాచారాన్ని దగ్గరపెట్టి మాజీ మంత్రులను విచారించనుంది.


వీరి తర్వాత మాజీ సీఎం కేసీఆర్ వంతు కానుందని సమాచారం. మొత్తం అందరి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది పీసీ ఘోష్. ఆ తర్వాత రేవంత్ సర్కార్ దాన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించనుంది. ఆ తర్వాత నేతలు, అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది సభకు వదిలేయాలని నిర్ణయించినట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: ఫార్ములా ఈ రేసు కేసు.. సేఫ్ గేమ్ ఆడిన బీఎల్ఎన్‌రెడ్డి

ఈ విచారణకు సంబంధించి తొలుత తొలుత కన్‌స్ట్రక్షన్, డిజైన్స్, క్వాలిటీ పర్యవేక్షణ, అకౌంట్స్ విభాగాలకు చెందినవారిని మాజీ అధికారులను విచారించింది. ఆ తర్వాత బ్యారేజీలకు నిధుల సేకరణపై దృష్టి పెట్టింది. అటు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు శ్రీరాం, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ వారు కమిషన్ ఎదుట హాజరైన పలు విషయాలు వెల్లడించారు.

Related News

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Big Stories

×