IPS Vasundhara Yadav: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఒక ఐపీఎస్ అధికారిణి తన సాహసంతో, అంకితభావంతో అందరి మనసు గెలుచుకున్నారు. ఆమె పేరే వసుంధర యాదవ్. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ డివిజన్ ఏసీబీ (ACP)గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె, ఈ జాతరలో తన వృత్తి పట్ల చూపిస్తున్న నిబద్ధతతో సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారారు.
జాతరలో లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం ఒక సవాలుతో కూడిన పని. ఈ క్రమంలో ఏసీబీ వసుంధర యాదవ్ తన విధుల్లో నిమగ్నమై ఉండగా, కొందరు ఆకతాయిలు బాధ్యతారాహిత్యంగా పారేసిన బీరు సీసా ముక్కలు ఆమె కాలికి బలంగా గుచ్చుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆమె కాలి బొటనవేలికి తీవ్ర గాయమై రక్తం ధారగా కారింది. భక్తుల భద్రతే ధ్యేయంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న తరుణంలో ఈ అవాంతరం ఎదురైంది.
సాధారణంగా ఇలాంటి తీవ్రమైన గాయాలైనప్పుడు ఎవరైనా విశ్రాంతి తీసుకుంటారు. కానీ, వసుంధర యాదవ్ తన వ్యక్తిగత బాధ కంటే కర్తవ్యానికే పెద్దపీట వేశారు. రక్తం కారుతున్నా సరే, వెంటనే ప్రాథమిక చికిత్స చేయించుకుని, కాలికి బ్యాండేజీతోనే తిరిగి విధుల్లోకి చేరారు. “జాతర ముగిసే వరకు భక్తులకు ఏ చిన్న ఇబ్బంది కలగకూడదు” అనే లక్ష్యంతో ఆమె చూపిన ఈ అంకితభావం చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.
కొద్దిరోజుల క్రితమే మేడారం జాతరలో మంత్రి సీతక్క, మహిళలతో కలిసి ఉత్సాహంగా అడుగులు వేసిన వసుంధర యాదవ్ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వైరల్ అయింది. అప్పట్లో ఆమె చురుకుదనాన్ని, గిరిజన సంస్కృతిపై ఆమెకున్న గౌరవాన్ని మెచ్చుకున్న నెటిజన్లు, ఇప్పుడు ఆమె వృత్తి పట్ల చూపిస్తున్న నిబద్ధతకు ‘సెల్యూట్’ చేస్తున్నారు. అందం, డ్యాన్స్తోనే కాదు, తన కఠినమైన పనితీరుతోనూ ఆమె నిజమైన ‘లేడీ సింగం’ అని నిరూపించుకున్నారు.
— vijay (@VijayMarka88) February 6, 2026
Read Also: CM Revanth Reddy: 70 వేల ఉద్యోగాలిచ్చాం! ఒక్కటి తక్కువైనా నా తల తీసుకుంటా.. కేసీఆర్కు రేవంత్ సవాల్