BigTV English

IRCTC: రైల్వే శాఖ గుడ్ న్యూస్.. దసరా, దీపావళి పండుగలకు స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే!

IRCTC: రైల్వే శాఖ గుడ్ న్యూస్.. దసరా, దీపావళి పండుగలకు స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే!

Dasara and Diwali: తెలుగు రాష్ట్రాల ప్రజలు దసరా, దీపావళి పండుగలను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో ఈ పండుగకు ప్రతి కుటుంబ సభ్యుడు ఇంటికి రావాల్సిందే. అంతా కలిసి పండుగ చేసుకోవాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. అందుకే దసరా, దీపావళి సమయాల్లో ఏ బస్సు చూసినా ఫుల్ ప్యాక్ అయి రాజధాని నగరం నుంచి జిల్లాలకు తరలుతుంటాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్‌లలో సీట్ల కోసం పాట్లు మామూలుగా ఉండవు. రైలు మార్గాలు కూడా అంతే. టికెట్లు ఎప్పుడో బుక్ అయిపోయి ఉంటాయి. జనరల్ బోగీల్లో ప్రయాణికులు కిక్కిరిసి వెళ్లుతుంటారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ఒక మంచి కబురు తెలిపింది. రైలు ప్రయాణం చేసే తెలుగు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.


దసరా, దీపావళి, ఛత్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణిలకు ఆటంకాలు తొలగించాలనే ఆలోచనతో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) 48 ప్రత్యేక ట్రైన్లను నడుపనుంది. ఎస్‌సీఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఎస్‌సీఆర్ ప్రకారం,
– కాచిగూడ నుంచి తిరుపతి(07653) ట్రైన్‌ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 11 వరకు సర్వీసులు అందిస్తుంది. ఈ ట్రైన్ కాచిగూడ వద్ద రాత్రి 10.30 గంటలకు బయల్దేరుతుంది. తర్వాతి రోజు ఉదయం 10.10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆరు గురువారాలు సర్వీస్ అందిస్తుంది.


– తిరుపతి నుంచి కాచిగూడ (07654) ట్రైన్ అక్టోబర్ 11 నుంచి నవంబర్ 15వ తేదీ (ప్రతి శుక్రవారం సేవలు) వరకు నడుస్తుంది. తిరుపతి స్టేషన్‌లో ఈ ట్రైన్ రాత్రి 8.05 గంటలకు డిపార్చర్ అవుతుంది. తర్వాతి రోజు రాత్రి 9.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

– సికింద్రాబాద్ నుంచి నాగర్సోల్ (07517) ఈ సర్వీసు అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ (ప్రతి బుధవారం అందుబాటులో సికింద్రాబాద్ స్టేషన్‌లో అందుబాటులో ఉంటుంది.) వరకు ఉంటుంది. ఈ ట్రైన్ సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.

Also Read: September New Financial Rules: సెప్టెంబర్ 1 నుంచి మారబోతున్న సామాన్యుడి జీవితం.. ఆధార్, క్రెడిట్ కార్డ్, గ్యాస్ సిలిండర్..

– నాగర్‌సోల్ నుంచి సికింద్రాబాద్ (07518) సర్వీస్ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 7వ తేదీ (ప్రతి గురువారం) వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ రాత్రి 10 గంటలకు బయల్దేరి సికింద్రాబాద్‌కు మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు చేరుకుంటుంది.

– కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ (07122) ట్రైన్ అక్టోబర్ 7 నుంచి నవంబర్ 4వ తేదీ ( ప్రతి సోమవారం) వరకు సర్వీసులు అందిస్తుంది. సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.

– సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ (07188) సర్వీస్ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 5వ తేదీ (ప్రతి మంగళవారం) వరకు అందుబాటులో ఉంటుంది. ఉదయం 8 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 6.45 గంటలకు చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక ట్రైన్‌లలో ఫస్ట్ ఏసీ కమ్ 2ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాసు, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు కూడా ఉంటాయని ఎస్‌సీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×