E-Paper
Advertisement

JEE Mains 2024 : జేఈఈ మెయిన్ అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే..

JEE Mains 2024 : జేఈఈ మెయిన్ అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే..
Advertisement

JEE Mains 2024(telugu news updates):

జేఈఈ మెయిన్‌ సెషన్‌ -1 (JEE Main Session-1) పరీక్షలు మొదలయ్యాయి. బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 24న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) అధికారులు పేపర్‌-2 పరీక్ష నిర్వహించగా.. పేపర్‌-1 పరీక్షకు సర్వం సిద్ధం చేశారు.

27న జరిగే పేపర్‌-1( బీఈ/ బీటెక్) పరీక్షకు జేఈఈ మెయిన్ అడ్మిట్‌ కార్డుల్ని (JEE Main Admit Cards) విడుదల చేశారు. విద్యార్థులు తమ అడ్మిట్‌ కార్డుల్ని ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.ac.in/ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, కోర్స్, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ చేయడం ద్వారా అడ్మిట్ కార్డుల్ని పొందొచ్చు.

Advertisement

దేశవ్యాప్తంగా జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జేఈఈ మెయిన్‌ (JEE Main) పేపర్‌ 1 పరీక్ష రెండు షిఫ్టుల్లో జరగనుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. మొదటి పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉండగా.. రెండో పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.

గతేడాది కన్నా ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా దాదాపు 12.30లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2.5లక్షల మందికి పైగా ఉన్నారు. దేశంలోని ఎన్‌ఐటీ (NIT)లు, ట్రిపుల్‌ (EEE), ఐటీ(IT)ల్లో బీటెక్‌ (BTECH) కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్‌ ర్యాంకులే ప్రామాణికం.

Advertisement

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×