Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని కుటుంబసభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలియగానే ఆయన మద్దతుదారులు షాక్కు గురయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత గురయ్యారు. వెంటనే ఆయన్ని కుటుంబసభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పుడ్ పాయిజన్ అయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే కొందరు కాంగ్రెస్ నేతలు నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. జీవన్రెడ్డి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు జీవన్రెడ్డి ఆరోగ్యం విషయం తెలియగానే ఆయన నియోజకవర్గం మద్దతుదారులు కంగారు పడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు జీవన్రెడ్డి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోందని, పర్వాలేదని చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
మున్సిపల్ ఎన్నికలు, ఫలితాలతో పాటు ఛైర్మన్ ఎన్నిక వరకు జీవన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారని కార్యకర్తలు చెబుతున్నారు.
మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
పుడ్ పాయిజన్ అయినట్లు చెబుతున్న కుటుంబ సభ్యులు
Former MLC Jeevan Reddy falls ill
Family members shifted him to NIMS Hospital in Hyderabad
Family members say it is suspected to be food… pic.twitter.com/Ze8T591gPs
— BIG TV Breaking News (@bigtvtelugu) February 20, 2026