Naa Anvesh : ప్రముఖ యూట్యూబర్ నాన్ వెజ్ అన్వేషణకు ఇంస్టాగ్రామ్ మెటా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని బ్యాన్ చేసింది. అతడి ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.. మహిళల వస్త్రధారణ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయన తనదైన స్టైల్ లో స్పందించారు. గత కొంతకాలంగా ఆయన తన ఇన్స్టా ఖాతాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, హిందూ దేవుళ్లను కించపరిచేలా వీడియోలు చేస్తున్నాడు.. అయితే అన్వేష్ ప్రవర్తన పై ఇప్పటికే అనేకచోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి.. ఈ క్రమంలో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని తొలగించినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. తాజాగా తన అకౌంట్ బ్యాన్ చేయడంపై యూట్యూబర్ నా అన్వేష్ స్పందించారు.. ఆయన తన మరో ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేసారు ప్రస్తుతం అది సంచలనంగా మారింది. ఇంతకీ నా అన్వేష్ఆ వీడియోలో ఏం చెప్పాడో ఒకసారి మనం తెలుసుకుందాం..
ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ గత కొద్ది రోజులుగా ఆయన సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పంజాగుట్ట పిఎస్ లో ఆయనపై పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్మెటా ఆయన కొన్ని తొలగించినట్లు ప్రకటించింది.. తన అకౌంటు బ్యాన్ చేయడంపై నా అన్వేష్ తాజాగా స్పందించారు.. ఆయన తన సోషల్ మీడియా వేదికగా మరో వీడియోని రిలీజ్ చేశారు.. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. నా అకౌంట్ బ్యాన్ అయింది అని తెలుసుకుని చాలామంది సంతోష పడినట్లు ఉన్నారు. అయిపోతే ఇంకొకటి నాకు రెండు ఇంస్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి. అలాగే రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అని అన్నారు. అవి నాకు రెండు చేతులు రెండు కాళ్లు లాగా ఉన్నాయి. అందులో ఒక చెయ్యి పోయినంత మాత్రాన నాకు పోయేదేమీ లేదు. ఒక్క యూట్యూబ్ నుంచే నాకు నెలకు 8 లక్షలకు పైగా వస్తున్నాయి. 2026లో బత్తాయి లకు నరకం చూపిస్తానంటూ ఆ వీడియోలో ఉంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వీడియో ఎలాంటి వివాదాలకు కేరాఫ్ గా మారుతుందో చూడాలి.
?igsh=MXRtMWd0ZXc4cjltNg==
Also Read : మాధవ్ కు మాటిచ్చిన గాయత్రి.. మహాను రప్పించేందుకు లలిత ప్లాన్..చక్రికీ దిమ్మతిరిగే షాక్..
యూట్యూబర్ అన్వేష్ కొన్ని రోజుల క్రితం హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలపై హిందువులతో పాటుగా కొంతమంది సినీ ప్రముఖులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనపై పంజాగుట్ట పిఎస్ లో కేసులు నమోదయ్యాయి.. ఈ కేసులో భాగంగా పోలీసులు ఇంస్టాగ్రామ్ కి ఒక లేఖ రాసినట్లు తెలిసింది. దానిపై స్పందించిన ఇంస్టాగ్రామ్ ప్రతినిధులు నా అన్వేష్ అకౌంట్ ని బ్లాక్ చేశారు.. తన ఐడిని తొలగించినట్లు ప్రకటించారు.. అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ అకౌంటుకు 18 మిలియన్ల మంది పాలోవర్లు ఉండేవారు.. ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు చాలామంది ఫాలోవర్స్ అతని అన్ ఫాలో చేశారు చివరికి 1.3 మిలియన్ల మంది మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారు.. ఇప్పుడు ఆ కొన్ని బ్యాన్ చేశారు. తన అకౌంట్ ని బ్యాన్ చేయడంపై అన్వేష్ స్పందిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం అది నెట్టింట చర్చనీయాంశంగా మారింది.. అందులో బత్తాయిలకు నరకం చూపిస్తానంటూ అన్వేష్ అనడంపై మరోసారి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న అన్వేష్ మరోసారి తన వీడియోతో వార్తల్లో నిలిచాడు. ఇకముందు ఎలాంటి వీడియోలను పోస్ట్ చేస్తాడో అన్నది ఆసక్తిగా మారింది..