BigTV English

Telangana:తెలంగాణకు కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియామకం

Telangana:తెలంగాణకు కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియామకం

Jishnudev varma appointed as Telangana New Governor: తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ నియామకం జరిగింది. ఇప్పటిదాకా ఇన్ ఛార్జీ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ స్థానంలో జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము శనివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. త్రిపుర రాష్ట్రంలో జన్మించిన జిష్ణుదేవ్ వర్మ 2018 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం దాకా త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా చేశారు. 1990 సంవత్సరం నుంచి బీజేపీ పార్టీ కార్యకలాపాలలో చురుకుగా ఉంటూ వచ్చారు.


బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా..

కొంత కాలం ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సేవలు అందించారు. కాగా సీపీ రాధాకృష్ణన్ ను కేంద్రం మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేసింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి గవర్నర్ గా రామన్ దేకా, అస్సాం, మణిపూర్ లకు గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్, సిక్కిం రాష్ట్రానికి ఓం ప్రకాష్ మాథుర్, రాజస్థాన్ రాష్ట్రానికి గవర్నర్ గా హరిభౌ కిషన్ రావు, పంజాబ్, ఛండీగడ్ ప్రాంతాలకు గవర్నర్ గా ఎల్జీ గులాబ్ చంద్ లు నూతన గవర్నర్ లుకా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×