Jogini Shyamala: తెలంగాణలో భోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సికిద్రాబాద్ లస్కర్ భోనాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆధ్యాత్మికవేత్తగా పేరుగాంచిన జోగిని శ్యామల పండుగరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో జోగిని వ్యవస్థ మరియు వారి సంసృతిపై సాంప్రదాయాలపై ప్రస్ధుత సమాజంలో జోగిని సంస్కృతీపై జరుగుతున్న దాడులపై శ్యామల స్పందించారు. మా మాట వినకుండ గత ప్రభుత్వాలు మరియు ఇప్పటి ప్రభుత్వాలు అందరు కలిసి మమ్ములను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.
అమ్మవారికి భోనాలు తీసుకుని వస్థున్న సమయంలో పోలీసులు మమ్ములను నెట్టివేయడం దారుణం అని అన్నారు. పోలీసులు మమ్ములను ఇబ్బందికి గురిచేసారంటూ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. మా భోనాలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు సిగ్గుతో తల దించుకోవాల్సిన రోజంటు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మీటింగులు మీటింగులు అంటూ మమ్ములను విసికించారని అటెండ్ అయినప్పటికి చివరికి మమ్ములను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: ఆలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్!
గత ప్రభుత్వాలు మాకు కొంచెం ఫేవర్ చేశాయని ఇప్పుడు మోత్తానికే మమ్ములను పట్టించుకోవడంలేదని అన్నారు. కానీ ఆనాటి నుండి నేటి వరుకు మేము ఇలానే ఉన్నామని అన్నారు. మేము ఏరోజున అయితే భోనాలు తీస్తామో అదే రోజున పండుగ చేయాలని ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకులు, వీఐపీలకోసం పండుగ చేసుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జోగీనీలు ఏప్పుడైతే భోనాలు తీస్తారో ఆ రోజే పండుగ చేయాలని నోక్కి చెప్పారు. నా ఆఖరి శ్వాస వరకు ఆధ్యాత్మిక సేవే చేస్తానని , ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరు ఏమనుకున్నా సరే నా శరీరంలో ఊపిరి ఉన్నంతవరకు అమ్మవారి సేవే చేస్తాని ఆమే అన్నారు. తెలంగాణ సంసృతి సాంప్రాదాయాల కోసం నా చివరి శ్వాస వరకు నా ధర్మాన్ని సాంప్రదాయాన్ని వీడనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Jogini Shyamala Warning | మమ్మల్నే ఏడిపిస్తారా .. Ujjaini Mahankali Bonalu 2026 | BIG TV#bigtvlive #bigtvtelugu #bigtv pic.twitter.com/HJhO0Juyq2
— BIG TV Breaking News (@bigtvtelugu) August 2, 2026
Also read: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు కుట్ర కలకలం!