E-Paper
Advertisement

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్..  ప్రచారానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్?
Advertisement

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎంతవరకు వచ్చింది? ప్రధాన పార్టీల నుంచి స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగేశారా? టీడీపీ-జనసేన పార్టీల మాటేంటి? ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాయి? లేకుంటే తటస్థంగా ఉంటాయా? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొనే అవకాశముందా? అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు.

వేడెక్కిన జూబ్లీహిల్స్ బైపోల్

Advertisement

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కింది. విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగేశారు. ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అభివృద్ధి తాము చేస్తామంటే తాము చేస్తామని చెబుతున్నాయి. విపక్ష బీఆర్ఎస్ మాత్రం గతంలో చేసిన అభివృద్ధి చెప్పే ప్రయత్నం చేస్తోంది.

జూబ్లీహిల్స్ బైపోల్‌లో గెలిచిన పార్టీ.. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడం ఈజీ అవుతుందని భావిస్తున్నాయి పార్టీలు. ఈ గెలుపు ప్రభావం దానిపై పడుతుందని అంటున్నాయి. అందుకే బైపోల్‌ని అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఇక ప్రచారానికి కేవలం రెండువారాలు మాత్రమే మిగిలివుంది.

Advertisement

ప్రచారంలోకి స్టార్ క్యాంపెయినర్లు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో టీడీపీ-జనసేన పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో సెటిలర్స్ ఓట్లు కీలకంగా మారింది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేనల మద్దతుపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వచ్చారని అన్నారు.

ALSO READ: చెప్పుతో కొట్టండి.. పోచారం స్వరం మారుతుందా?

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ప్రచారానికి వచ్చే ఛాన్స్ ఉందని మనసులోని మాట బయటపెట్టారు సదరు మంత్రి. ఆ నేతల ప్రభావం బైపోల్‌పై ఉంటుందన్నారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు యాక్టివ్‌గా ఉండలేకపోవచ్చుకానీ, ఆ నేతలిద్దరి చరిష్మా పని చేస్తుందన్నారు. వారిద్దరు ప్రచారం చేస్తే బీజేపీకి అనుకూలంగా మారుతుందని, పార్టీ హైకమాండ్ ఆ దిశగా చర్యలు చేపట్టవచ్చని అంటున్నారు.

ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి సత్యకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తెలియగానే తెలంగాణ బీజేపీ నేతలు ఫుల్‌ఖుషీ అవుతున్నారు.  ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ప్రచారానికి దిగితే మా విజయం ఈజీ అవుతుందని నేతలు భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×