E-Paper
Advertisement

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్.. రేపు ఈ ప్రాంతాల్లో సెలవు ఉంటుందా..?

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్.. రేపు ఈ ప్రాంతాల్లో సెలవు ఉంటుందా..?
Advertisement

Jubilee Hills bypoll counting: తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠకు గురి చేస్తోన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కౌంటింగ్ రేపు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన రేపు (శుక్రవారం రోజున) పలు ప్రభుత్వ పాఠశాలలకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈ కీలక ఘట్టం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసినన ప్రభుత్వ భవనాలు, వాటిలో పని చేసే ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సెలవు కేవలం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు మాత్రమే వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సెలవును చెల్లింపుతో కూడిన సెలవు (Paid Holiday) గా పరిగణించనున్నట్లు తెలిపారు. అంటే, ఈ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు సెలవును అనుభవించినప్పటికీ.. ఆ రోజుకు సంబంధించిన జీతాన్ని కోల్పోరు. ఉద్యోగుల ఎన్నికల విధులను, ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రశాంతంగా ముగియగా.. ఇప్పుడు అందరి దృష్టి రేపు జరగబోయే ఓట్ల లెక్కింపుపైనే ఉంది. రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ, ప్రధానంగా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో గెలుపును అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లెక్కింపు ప్రక్రియ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉండడంతో.. మధ్యాహ్నం లోపు ఉపఎన్నిక తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఫలితం రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.

Advertisement

ALSO READ: Vizag Summit: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ ప్రతినిధి బృందం భేటీ.. ఏపీలో భారీ పెట్టుబడులకు ఎంవోయూలు

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×