E-Paper
Advertisement

Kavitha : కవితపై కేఏ పాల్ సంచలన కామెంట్స్

Kavitha : కవితపై కేఏ పాల్ సంచలన కామెంట్స్
Advertisement

Kavitha : కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ చీఫ్. ఏ టాపిక్ అయినా మాట్లాడుతారు. ఎవరినైనా విమర్శిస్తారు. ఎవరూ అడిగినా, అడగక పోయినా స్పందిస్తారు. తానున్నానంటూ బలంగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తారు. మాటలు కాస్త తిక్క తిక్కగా ఉన్నా.. పక్కా లెక్కతో మాట్లాడుతారు. ప్రధాని మోదీ నుంచి పాస్టర్ ప్రవీణ్ వరకూ ఎవరినీ వదిలిపెట్టరు. పవన్, జగన్.. రేవంత్, కేసీఆర్.. అందరి గురించీ, అన్ని పార్టీల గురించీ.. ఏదో ఒకటి వాగుతారు. వారెవా అనిపించకపోయినా.. ఫుల్ లెన్త్ కామెడీ మాత్రం ఖాయం. కాకపోతే, ఆయన చెప్పేదంతా ఓపిగ్గా విని, భరించాల్సి ఉంటుంది. అందులోనుంచి అసలాయన ఏం చెప్పదలుచుకున్నారో అర్థం చేసుకోవడం పెద్ద టాస్కే అంటారు. అలాంటి కేఏ పాల్.. కవిత ఎపిసోడ్‌పై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందరూ తనను అడుగుతున్నారని.. అందుకే తానీ వీడియో విడుదల చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ పాల్ ఏమన్నారంటే..

కవిత టార్గెట్స్ ఇవే..

Advertisement

కేఏ పాల్ చెప్పిన దాని ప్రకారం.. కవిత రెండు మెయిన్ టార్గెట్స్‌తో పావులు కదుపుతున్నారని అన్నారు. వైఎస్ షర్మిల చేసిన విధంగానే కవిత కూడా చేస్తున్నారని చెప్పారు. అన్న కోసం షర్మిల రెండేళ్లు పాదయాత్ర చేసినా.. పదవులు, లక్షల కోట్ల ఆస్తులు దక్కలేదనే కోపంతో సొంతంగా పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీ పీసీసీ చీఫ్ అయ్యారని అన్నారు. సేమ్ టు సేమ్.. కవిత కూడా సొంతంగా పార్టీ పెట్టి.. తన శక్తిని బీజేపీకి చూపించాలని భావిస్తున్నారని చెప్పారు. కొన్నాళ్ల తర్వాత కవిత పార్టీ బీజేపీలో విలీనం కావొచ్చని అంచనా వేస్తున్నారు పాల్.

వాటా వసూల్ కోసమే..

Advertisement

మరోవైపు, కొత్త పార్టీ పెడతానంటూ కేసీఆర్‌ను కవిత భయపెడుతున్నారని కూడా అన్నారు కేఏ పాల్. ఎందుకంటే, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సుమారు రూ.5 లక్షల కోట్లు సంపాదించారని తెలిపారు. ఆ సొమ్మంతా కేటీఆర్‌కే ఇవ్వడం కవితకు ఇష్టం లేదని చెప్పారు. అందుకే, కొత్త పార్టీ పేరుతో తండ్రిని బ్లాక్‌మెయిల్ చేసి.. 5 లక్షల కోట్లలో తన వాటా వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

పాలన మారాలి.. పాల్ రావాలి..

కేసీఆర్ కుటుంబంలో ఎవరు పార్టీ పెట్టినా నమ్మొద్దని.. కుటుంబ పార్టీలకు బహుజనులు దూరంగా ఉండాలని పిలుపు ఇచ్చారు పాల్. మార్పు రావాలంటే పాలన మారాలి.. పాల్ రావాలి.. అని అన్నారు. తానొస్తేనే అన్నీ మారుతాయని చెప్పారు. తాను ప్రపంచానికి లక్షల కోట్లు పంచానని.. కాబట్టి, తానేమీ మిగతా నాయకుల్లా లక్షల కోట్లు దోచుకోనని చెప్పారు కేఏ పాల్.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×