Kavitha: హైదరాబాద్ లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కీసర క్రాస్ రోడ్డులోని ఆరాధ్య కన్వెన్షన్ లో జరిగిన ఈ పెళ్లికి కవిత హాజరై.. వరుడి ఇంటి ఆడబిడ్డగా వ్యవహరించారు. వరుడి కుల ఆచారం ప్రకారం అడపడుచుగా మారి వధువు మెడలో కవిత తాళి కట్టారు. ఈ ఘటనతో పెళ్లి మండపం మెుత్తం ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు. హర్షద్వానాలతో కవిత మంచి మనసును ప్రశంసించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గూడురు గ్రామానికి చెందిన తెలంగాణ రక్షణ సేన కార్యకార్త బాలప్రసాద్ కు సీతాఫల్ మండీకి చెందిన శివానితో వివాహం కుదిరింది. దీంతో కవిత ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే బాలప్రసాద్.. ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి కావడంతో వారి సంప్రదాయం ప్రకారం వరుడు తాళి కట్టడానికి ముందు ఆడపడుచు చేత పసుపు కొమ్ముతో మూడు ముళ్లు వేయించే ఆచారం ఉంది. దీనిని పాటిస్తూ.. కవిత వధువు మెడలో తాళి కట్టారు.
ఇంటి ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత గారు
ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత గారు
తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు.… pic.twitter.com/0hEsqsczQv
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) August 26, 2026
అదే సమయంలో సంప్రదాయానికి అనుగుణంగా వదువు వేలికి ఉంగరం సైతం కవిత తొడిగారు. అనంతరం బాలప్రసాద్ వధువుకు తాళి కట్టి వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వధూవరూలకు నూతన వస్త్రాలను సమర్పించి ఇద్దరిని కవిత ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. రక్షణ సేనలో కీలకంగా వ్యవహరిస్తున్న బాల ప్రసాద్ కు సోదరిగా మారి కవిత దగ్గరుండి వివాహం జరిపించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: నేపాల్లో అకస్మిక వరదలు.. 16 మంది మృతి.. 105 మంది భారతీయులు గల్లంతు!