Eshwar Sai-Madhuri Rathod Controversy:ఈశ్వర్ సాయి..మాధురి రాథోడ్ లు అడ్డంగా దొరికిపోవడంతో ఫోక్ ఇండస్ట్రీలోని పలువురు ఈ వివాదంపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు.ఈ క్రమంలో ‘నీలి నీలి కళ్ళావాడే’అనే పాటతో పాపులర్ అయిన ఫోక్ సింగర్ బాసాని మమత ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.ఇంతకీ తనేమందో ఒక సారి చూసేద్దాం.
ఫోక్ ఇండస్ట్రీ ఒకప్పుడు చాలా బాగుండేదని కానీ క్రమంగా నాశనం అయిపోయిందని, అప్పుడు కనిపించిన స్వచ్చత,ఆ వాతావరణం ఇప్పుడు లేదని వాపోయింది.ఇక ఇండస్ట్రీలో కమిట్ మెంట్ లు కూడా అప్పుడే ఉన్నాయని,నన్ను కూడా ఒక రైటర్ కమిట్ మెంట్ అడిగాడని, ఎలా కనిపిస్తున్నాను ..చెప్పుతో కొడతానని అన్నానని చెప్పుకొచ్చింది.
ఇక ఆ పరిస్థితి ఎదురవడంతో ఈ ఫోక్ ఇండస్ట్రీకి తానూ సరిపోనని అనుకుని పక్కకి తప్పుకున్నానని తెలిపింది.ఇక ఈ ఫోక్ ఇండస్ట్రీలోకి వస్తున్న అమ్మాయిలు దేనికంటే దానికి సిద్దం అంటున్నారని, కారు ,ఐ ఫోన్ ఇలా రిచ్ లైఫ్ మెయింటేన్ చేయడం కోసం కమిట్ మెంట్ లు ఇచ్చేందుకు కూడా వెనుకాడట్లేదు అని మండిపడింది.
also read :ఈశ్వర్ సాయి వీడియో మళ్లీ బయటకు.. రాఖీ కట్టించుకో అంటూ…
ఇక ఇదే క్రమంలో ఈశ్వర్ సాయి , మాధురి రాథోడ్ ల మధ్య జరిగిన వ్యవహారంపై స్పందిస్తూ జరిగిన విషయంలో ఇద్దరిదీ తపుఉందని, అయ్యో నాకు పెళ్లి అయింది, ఒక బాబు ఉన్నాడు కదా ..మరొక అమ్మాయితో ఎందుకు అలా చేయాలి అని అలోచించి ఉంటె ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇక మాధురి రాథోడ్ కూడా ఈశ్వర్ సాయి భార్య కూడా నాలాగే ఒక ఆడది, వాళ్ళ సంసారంలోకి నేనెందుకు వెళ్ళాలి అని ఆలోచించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని తన అభిప్రాయాన్ని తెలిపింది.
ఇక ఇపుడు ఈ వ్యవహారం ఇలా రోడ్డున పడటంతో ఫోక్ ఇండస్ట్రీ అంటే అంతా కమిట్ మెంట్ లు ఉంటాయని అనుకుంటున్నారని ఫైర్ అయింది.ఇక ఇండస్ట్రీలోకి ఎవరినైనా అమ్మాయిలని పంపించాలనుకుంటే ఇలాంటి వారి వల్లే ఆగిపోతున్నారని,ఇలా ఈశ్వర్ సాయి , మాధురి రాథోడ్ ల వ్యవహారాల వల్లే ఫోక్ ఇండస్ట్రీ పరువు మంట కలుస్తుందని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు అసలు టచ్ చేయకుండా ఫోక్ సాంగ్స్ చేసేవారని, ఇపుడు టచ్ చేయకుండా ఉన్న ఫోక్ సాంగ్ ఒక్కటి కూడా లేదని తనదైన శైలిలో మండిపడింది.
నాగదుర్గ వంటి వారు ఎలాంటి అసభ్యత లేకుండా డాన్స్ లు చేస్తున్నారని,అలాంటిది పాటలల్లో ఎందుకు అంత అడల్ట్ గా, కిస్ లు ,హాగ్ లు ఉండేవిధంగా ఎందుకు కొరియోగ్రఫీ చేయాల్సి వస్తుందో అర్థం కావట్లేదని వాపోయింది.
also read :పెద్దికి ఓ రూల్.. టాక్సిక్కి మరో రూల్? దొరికిపోయిన రాజు బ్రదర్స్!
మొత్తంగా జానపదాలు బ్రష్టుపట్టిపోతున్నాయని, తిరిగి జానపదం బతికి బట్టకట్టాల్సి ఉందన్న మమత బాసాని కామెంట్స్ ఇపుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.