E-Paper
Advertisement

కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. 2000 కార్లతో భారీ ర్యాలీ..!

కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. 2000 కార్లతో భారీ ర్యాలీ..!
Advertisement

Kalvakuntla Kavitha: స్వేచ్చ బ్యూరో: మేడ్చల్ జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధి మునీరాబాద్ గ్రామంలోని అద్వయ కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 25న కవిత కొత్త రాజకీయ పార్టీ ఆవిష్కరణ సభ ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా వరంగల్ కాకతీయ తోరణం ఆకృతిలో ప్రధాన ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. సభ ప్రాంగణంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ప్రముఖ మహనీయులైన బి ఆర్ అంబేడ్కర్, జ్యోతి రావు పూలే, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

2000 కార్లతో ర్యాలీ..

ఉదయం 8 గంటలకు సభ ప్రారంభం కానుండగా, 10 గంటలకు పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. సభకు ముందు కవిత అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, అనంతరం సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సుమారు 2000 కార్లతో బంజారాహిల్స్ వైపు భారీ ర్యాలీగా బయలుదేరి, వివిధ నియోజకవర్గాలు మరియు ఓల్డ్ సిటీ మీదుగా పార్టీ జెండా ఆవిష్కరణలు నిర్వహిస్తూ పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమానికి 40 నుంచి 50 వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా 60 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు.

Advertisement

Also Read: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సిత్రాలు.. హుగ్లీ నదిలో ప్రధాని మోదీ ప్రయాణం, లాహిరి లాహిరి లాహిరిలో

50 ఎకరాల పార్కింగ్ ప్లేస్..

అద్వయ కన్వెన్షన్ హాల్‌లో సుమారు 20 వేల మందికి సామర్థ్యం ఉండగా, హాల్ చుట్టూ 18 ఎకరాల విస్తీర్ణంలో విస్తృత సదుపాయాలు కల్పించారు. అదనంగా, వృద్ధులు మరియు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్‌చైర్ సదుపాయం కల్పించడంతో పాటు, వారికి సులభంగా రాకపోకలు సాగేందుకు ప్రత్యేక మార్గాలు, సహాయక సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చే వాహనాల కోసం 50 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. సభలో పాల్గొనే వారికి స్పష్టమైన వీక్షణ కోసం 35 భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

Also Read: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?R

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×