Attack On Karate Kalyani: హైదరాబాద్లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పేరుతో సాగుతున్న భారీ మోసాన్ని బట్టబయలు చేసే క్రమంలో సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణిపై దాడి యత్నం జరిగింది. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది.
టీటీడీలో లక్కీ డ్రా పేరుతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు భారీ మోసానికి తెరలేపారు. కేవలం ₹399 కడితే ఫార్చ్యూనర్ కార్, ఐఫోన్, టీవీ, బైక్ వంటివి గెలుచుకోవచ్చంటూ సామాన్య ప్రజల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆదిభట్ల వండర్లా సమీపంలో నిందితులు ఈ లక్కీ డ్రా ప్రచారం నిర్వహిస్తుండగా, కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసుల సహాయంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. నిందితులను పట్టుకునే క్రమంలో వారు కళ్యాణిపైకి దూసుకొచ్చి దాడికి యత్నించారు. ఈ పెనుగులాటలో నిందితులు ఆమె చున్నీని లాగడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తమ మోసపూరిత ప్రచారం కోసం ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు నిందితులు టీటీడీ ఆలయ పరిసరాలను, పేరును వాడుకోవడం గమనార్హం. ఈ ఘటనపై కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్ అనే ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్ 318(4) (మోసం) మరియు ఐటీ చట్టం 2008 సెక్షన్ 66 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కరాటే కళ్యాణిపై దాడికి యత్నం!
టీటీడీలో లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేసిన ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న కరాటే కళ్యాణి
నిందితులను పట్టుకునే క్రమంలో కళ్యాణిపైకి దూసుకొచ్చిన నిందితులు
ఆదిభట్ల వండర్ లా వద్ద నిందితులు లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తూ ఉండగా పంజాగుట్ట… pic.twitter.com/UlQejWBjBQ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 20, 2026
Read Also: కేటీఆర్కు లొట్టపీసు తప్ప ఏమీ తెలియదు.. పీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు!