E-Paper
Advertisement

కరీనంగర్ చోరీ.. పక్కా ప్లానింగ్‌తో దోపిడీ, పోలీసులకు చిక్కిన ఆధారాలు.. మొదలైన వేట!

కరీనంగర్ చోరీ.. పక్కా ప్లానింగ్‌తో దోపిడీ, పోలీసులకు చిక్కిన ఆధారాలు.. మొదలైన వేట!
Advertisement

Karimnagar Robbery: కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన జ్యువెలరీ షాప్ చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ నేరానికి పాల్పడింది బీహార్‌కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా అని ప్రాథమికంగా నిర్ధారించారు. సిసిటీవీ దృశ్యాలు, ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రాతిపదికన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు పకడ్బందీ వ్యూహాలను అమలు చేస్తున్నారు.

నిందితుల గుర్తింపు.. పాత నేరస్థుల హస్తం

Advertisement

చోరీకి పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని పోలీసులు పాత నేరస్థులుగా గుర్తించారు. గతంలో పలు నేరాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన ఆనంద్, ఇంతియాజ్ ఈ గ్యాంగ్‌లో ఉన్నట్లు బలమైన ఆధారాలు లభించాయి. గతంలో చందానగర్ జ్యువెలరీ షాప్‌లో జరిగిన చోరీలో పాల్గొన్న వారే ఈ ఘటనలోనూ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన ముగ్గురు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Also Read: నిజమైన పాపాల భైరవులు మీరే.. కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

బ్యాగుపై ఉన్న క్లూ.. దర్యాప్తులో మలుపు

దొంగలు షాపులో వదిలేసి వెళ్ళిన ఒక బ్యాగుపై ‘ఐ లవ్ నందూర్బార్’ అని రాసి ఉండటం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. నందూర్బార్ అనేది మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దుల్లోని జిల్లా అని గుర్తించిన అధికారులు, ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మే 3వ తేదీ ఉదయం 8:35 గంటలకు రుద్రారం నుంచి కరీంనగర్ వచ్చిన దొంగలు, ఉదయం 11 గంటలకు చోరీకి పాల్పడి కేవలం 12 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని పారిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.

తప్పించుకున్న మార్గం..గాలింపు చర్యలు

పోలీసుల కళ్ళు గప్పేందుకు ఈ ముఠా ప్రధాన రహదారులను కాకుండా దొడ్డిదారులు, కెనాల్ మార్గాలను ఎంచుకుంది. నిందితులు పరారైన పల్సర్ బైక్‌ను ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో పోలీసులు గుర్తించారు. బైక్‌తో పాటు సమీపంలోనే హెల్మెట్‌ను కూడా వదిలివెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం 16 ప్రత్యేక బృందాలుగా విడిపోయిన పోలీసులు గోదావరి తీర ప్రాంత గ్రామాలతో పాటు, అటవీ పరిసరాలు, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో నిఘా పెట్టారు.

Related News

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Big Stories

Advertisement
×