E-Paper
Advertisement

kavitha bail petition: కవిత‌కు నిరాశ.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చేవారం

kavitha bail petition: కవిత‌కు నిరాశ.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చేవారం

kavitha bail petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని ఈడీ కోరింది. దీంతో న్యాయస్థానం వచ్చేవారానికి (ఆగష్టు 27కు) విచారణ వాయిదా వేసింది. ఈడీ, సీబీఐ కౌంటర్లపై రిజాయిండర్ వేస్తామని తెలిపారు కవిత తరపు న్యాయవాదులు.

మంగళవారం ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదోపవాదనలు జరిగాయి. ఈ కేసులో మనీష్ సిసోడియాకు ఇప్పటికే బెయిల్ వచ్చిందని వాదించారు కవిత తరపు న్యాయ వాదులు. ఏకైక మహిళా నిందితురాలు కవిత అని, నాలుగు నెలలుగా కవితను జైలులో ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సమయంలో జోక్యం చేసుకున్న ఈడీ, అఫిడవిట్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరింది. గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. శుక్రవారం లోపు రీజాయిండర్ దాఖలు చేయాలని కవిత తరపు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది.

ALSO READ: హైదరాబాద్ కు రెడ్ అలర్ట్.. మళ్లీ క్లౌడ్ బరస్ట్ ?

అటు కవిత బెయిల్ పిటిషన్‌పై ఇప్పటికే కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. దీంతో ఈడీ తన అఫిడవిట్‌లో ఏయే అంశాలు తెరపైకి తీసుకొస్తుందోనన్న చర్చ మొదలైపోయింది. వచ్చేవారం కవితకు బెయిల్ రావడం ఖాయమని బీఆర్ఎస్ నేతల మాట.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×