Kavitha Plans: తాను మళ్లీ బీఆర్ఎస్లో చేరే ప్రసక్తి లేదని తేల్చేశారు తెలంగాణ జన జాగృతి చీఫ్, ఎమ్మెల్సీ కవిత. పార్టీ తనను సస్పెండ్ చేయడం బాధ కలిగిందని, ఆత్మగౌరవం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడనని తేల్చేశారు. తాను ఎవరో వదిలిన బాణం కాదని, తెలంగాణ ప్రజలు ఎక్కుపెట్టిన బాణాన్ని అని మరోసారి స్పష్టం చేశారు.
తాను బీఆర్ఎస్లో చేరే ప్రసక్తి లేదు-కవిత
తెలంగాణ జన జాగృతి చీఫ్ కవిత జనం బాట కార్యక్రమం అక్టోబర్ చివరలో మొదలుపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వారికి భరోసా ఇవ్వడం ముఖ్య ఉద్దేశం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు కొనసాగునుంది. వివిధ జిల్లాల్లో ఆమె పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కీలక విషయాలు వెల్లడించారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సంబంధాల గురించి వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పులు, జరిగిన అన్యాయాలకు నిలదీస్తూ క్షమాపణలు చెప్పారు.. చెబుతున్నారు. వారిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. ఈ విషయంలో ప్రజల గొంతుకగా తాను నిలుస్తామని చెప్పకనే చెబుతున్నారు. తాను తలపెట్టిన జనం బాట కార్యక్రమం రాజకీయాలకు అతీతమని అన్నారు.
తాను తెలంగాణ ప్రజలు ఎక్కుపెట్టిన బాణం
ప్రజల సమస్యలు ముఖ్యంగా రైతులు, బీసీలు, మహిళలు, యువత సమస్యలను తెలుసుకుని వాటిపై పోరాటం చేయడమే తమ లక్ష్యమన్నారు. తన పర్యటనలో సమస్యలను గుర్తించి వాటికి సంబంధించిన కమిటీలు వేసి ఫాలో అప్ చేస్తామన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చూపలేదని తేల్చేశారు.
రోడ్ల అలైన్మెంట్ల మార్పు, అవినీతి, రైతుల ఇబ్బందులపై ఆందోళన చేస్తామని తెలిపారు. ప్యూచర్ ప్రణాళిక గురించి మాట్లాడిన కవిత, సామాజిక తెలంగాణ సాధనే తమ ధ్యేయమన్నారు. 80 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తామని తేల్చిచెప్పారు. జాగృతి తరపున 2029 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీ చేస్తామని తేల్చి చెప్పేశారు. తెలంగాణ జాగృతిని పీపుల్ సెంట్రిక్ ఆర్గనైజేషన్గా బలోపేతం చేయాలన్నది తన ధ్యేయంగా పేర్కొన్నారు.
ALSO READ: సారొచ్చారు.. వెళ్లారు, కేసీఆర్ ఎత్తుకు రేవంత్ పైఎత్తులు