E-Paper
Advertisement

Hyderabad: భాగ్యనగరంలో జింక మాంసం కలకలం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్వోటీ బృందం

Hyderabad: భాగ్యనగరంలో జింక మాంసం కలకలం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్వోటీ బృందం

Hyderabad: హైదరాబాద్‌ మహానగర శివారులో అటవీ సంపదను హరించే వన్యప్రాణుల అక్రమ రవాణా దందా తాజాగా వెలుగుచూసింది. అత్తాపూర్ సమీపంలోని సులేమాన్ నగర్‌లో జింక మాంసాన్ని విక్రయిస్తున్న ఒక వ్యక్తిని రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. నిందితుడి నుంచి భారీగా మాంసం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

సులేమాన్ నగర్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫానుద్దీన్ అనే వ్యక్తి తన నివాసంలో రహస్యంగా జింక మాంసం విక్రయిస్తున్నాడనే సమాచారం పోలీసులకు అందింది. ఈ క్రమంలో ఎస్వోటీ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితుడి వద్ద సుమారు 15 కిలోల జింక మాంసం దొరికింది. కేవలం మాంసమే కాకుండా..  అటవీ జంతువులకు సంబంధించిన తోలు (చర్మం), తలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం (Wildlife Protection Act) కింద కేసు నమోదు చేసిన పోలీసులు..  నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు.

 పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జింకలను వనపర్తి జిల్లాలోని పెబ్బేరు ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. పెబ్బేరు పరిసర అటవీ ప్రాంతాల్లో జింకలను వేటాడి..  అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా వాహనాల్లో హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారు. నగరానికి తీసుకువచ్చిన తర్వాత వాటిని వధించి.. కిలో మాంసాన్ని సుమారు 800 రూపాయలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. కేవలం ధనార్జనే ధ్యేయంగా ఈ అక్రమ దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రస్తుతం ఈ కేసులో ఇర్ఫానుద్దీన్‌ను ప్రధాన నిందితుడిగా భావిస్తున్నప్పటికీ..  దీని వెనుక పెద్ద ముఠా ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పెబ్బేరులో జింకలను వేటాడేది ఎవరు? వేటగాళ్లకు, నగరంలోని విక్రేతలకు మధ్య ఉన్న సంబంధాలు ఏమిటి? ఈ సరఫరా గొలుసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కేవలం ఒకే చోట కాకుండా నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ మాంసం సరఫరా అవుతోందా అనే అంశాన్ని అత్తాపూర్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

ప్రకృతి సంపదైన వన్యప్రాణులను పొట్టనబెట్టుకుంటూ సాగుతున్న ఇలాంటి అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×