E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: స్థలం ఇస్తే సరిపోదు.. ఇల్లు కట్టించాలి.. మంత్రుల ప్రకటన వచ్చే వరకు దీక్ష వీడనన్న కవిత

Kalvakuntla Kavitha: స్థలం ఇస్తే సరిపోదు.. ఇల్లు కట్టించాలి.. మంత్రుల ప్రకటన వచ్చే వరకు దీక్ష వీడనన్న కవిత
Advertisement

Kalvakuntla Kavitha: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం క్లైమాక్స్‌కు చేరుకుంది. గత నెల 24వ తేదీన ఇళ్లు గుడిసెలు కోల్పోయిన పేదల పోరాటానికి ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నిర్వాసితుల్లోని అర్హులైన వారిని ఎంపిక చేసి రేపు సాయంత్రం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ప్రభుత్వ ప్రకటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం స్పందించి పట్టాలు ఇస్తామని చెప్పడం తమ దీక్షకు దక్కిన విజయమని పేర్కొన్నారు. అయితే మంత్రులు అధికారికంగా ప్రకటించే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని భీష్మించుక కూర్చున్నారు. కేవలం 70 లేదా 100 గజాల ఖాళీ స్థలం ఇస్తే సరిపోదని.. ఇల్లు కోల్పోయిన ప్రతి పేదవాడికి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఉట్టి స్థలం ఇచ్చి చేతులు దులుపుకుంటే ఊరుకోబోమని.. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.

Advertisement

ఖమ్మంలో పేదవాడి ఇళ్లపై ప్రతాపం చూపిన అధికార యంత్రాంగం.. జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లోని ధనవంతుల ఇళ్లను ఇలాగే కూలుస్తారా అని కవిత ప్రశ్నించారు. కొంతమంది అక్రమంగా ఉంటున్నారనే నెపంతో వందలాది మంది పేదల ఇళ్లను నేలమట్టం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వం 311 మందికి ఇళ్లు ఇస్తామంటోందని.. కానీ బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. అరెస్ట్ చేసిన 13 మంది బాధితులను తక్షణమే విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. రేపు మధ్యాహ్నం మంత్రులు నిర్వహించబోయే సమావేశంలో బాధితులకు ఇచ్చే ప్లాట్ల విస్తీర్ణం ఇళ్ల నిర్మాణంపై స్పష్టత రావాలని కోరారు.

ఇళ్లు కట్టిస్తారా లేదా అన్నది ప్రభుత్వం రేపు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ లోపు ఖమ్మం నగరంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పట్టాల పంపిణీ నిర్వహించే ప్రదేశాన్ని అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. భూ నిర్వాసితులకు పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తామని మంత్రులు గతంలోనే ప్రకటించారు.

Advertisement

Read Also: Velugumatla: వెలుగుమట్ల బాధితుల పోరు ఫలించింది.. రేపు మంత్రుల చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×