khushbu: విజయ్–త్రిషా కలిసి ఒక పెళ్లి వేడుకలో కనిపించడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నటి.. రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ స్పందిస్తూ ఇది వారి వ్యక్తిగత జీవితం అని స్పష్టం చేశారు.
తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు విజయ్ మరియు ప్రముఖ నటి త్రిషా కృష్ణన్ ఇటీవల ఒక పెళ్లి రిసెప్షన్లో కలిసి కనిపించడం పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు వస్తున్న సమయంలో ఈ సంఘటన సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అయింది. ఈ విషయంపై నటి .. రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ స్పందించారు.
ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రజలు అవసరానికి మించి పెద్దగా మాట్లాడుతున్నారని చెప్పారు. “ఇది వారి వ్యక్తిగత జీవితం. వారి వ్యక్తిగత విషయాలు ప్రజలను ప్రభావితం చేయకపోతే దానిపై పెద్దగా చర్చ అవసరం లేదు” అని ఖుష్బూ పేర్కొన్నారు.
ఆమె మాట్లాడుతూ సెలబ్రిటీలు కూడా మనలాగే సాధారణ మనుషులే అని గుర్తు చేశారు. వారు కూడా తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా జీవించే హక్కు కలిగి ఉన్నారని చెప్పారు. వారి వ్యక్తిగత నిర్ణయాలను ప్రజలు గౌరవించాలని ఖుష్బూ అభిప్రాయపడ్డారు.
ఇంకా ఒక ప్రశ్నకు సమాధానంగా విజయ్ ప్రజాదరణపై ఈ ఘటన ప్రభావం చూపుతుందా అని అడిగినప్పుడు, ఖుష్బూ దానికి అవకాశం లేదని అన్నారు. ప్రజలు ఎప్పుడు ఎవరికీ మద్దతు ఇవ్వాలో వారికి బాగా తెలుసని ఆమె అన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం వల్ల అతని ప్రజాదరణ తగ్గిపోదని ఆమె స్పష్టం చేశారు.
ఇటీవల విజయ్.. త్రిషా ఒక పెళ్లి వేడుకకు కలిసి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఇద్దరూ స్టేజ్పైకి వెళ్లి కొత్తగా పెళ్లి అయిన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా వారు కలిసి ఫోటోలు కూడా దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.
ఈ సంఘటన విజయ్ భార్య సంగీతతో విడాకుల వార్తలు వచ్చిన సమయంలో జరిగిందని చెప్పడంతో ఈ విషయం మరింత చర్చకు దారి తీసింది. అయితే ఖుష్బూ మాత్రం ఈ అంశాన్ని పెద్దగా చేయకుండా చూడాలని సూచించారు.
ALSO READ: Prabhas: మలయాళ దర్శకుడితో ప్రభాస్.. కొత్త పాన్ ఇండియా సినిమాకి సర్వం సిద్ధం..!