E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: గుంట నక్కను నమ్మి గోతిలో పడ్డారు.. బీఆర్ఎస్ పై కవిత షాకింగ్ కామెంట్స్!

Kalvakuntla Kavitha: గుంట నక్కను నమ్మి గోతిలో పడ్డారు.. బీఆర్ఎస్ పై కవిత షాకింగ్ కామెంట్స్!

Kalvakuntla Kavitha: నైనీ బొగ్గు గని వ్యవహారంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, సింగరేణి వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఒక వింత ట్రెండ్ నడుస్తోందని, కొన్ని శాటిలైట్ ఛానెళ్లలో వస్తున్న వార్తలను బీఆర్ఎస్ నాయకులు గుడ్డిగా సమర్థిస్తున్నారని ఆమె విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు వేసిన ఒక ఛానెల్ కార్యాలయంపై కేటీఆర్ అనుచరులు దాడి చేయడాన్ని ఆమె ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టగానే, దానికి కౌంటర్ ఇవ్వడానికి కేటీఆర్ (గుంట నక్కగా అభివర్ణిస్తూ) హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టారని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ‘గుంట నక్క’ను నమ్మి గుడ్డిగా గోతిలో పడిందని, ప్రజలే త్వరలో ఆ పార్టీని నిషేధిస్తారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక జోక్‌లా మారిందని మండిపడ్డారు. అసలు టెర్రరిస్టుల నిఘా కోసం ఉండాల్సిన ట్యాపింగ్‌ను అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 నైనీ బొగ్గు గని 2015లో తెలంగాణకు కేటాయించబడిందని, అంతకుముందు అది గుజరాత్ వద్ద ఉండేదని ఆమె గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే డీజిల్ టెండర్లు ఉన్నాయని, వారి కాలంలోనే 25 టెండర్లు పొడిగించబడ్డాయని వెల్లడించారు.

 ఒక పెద్ద తిమింగలాన్ని (మెగా కృష్ణా రెడ్డిని ఉద్దేశించి) కాపాడటం కోసమే చిన్న చేపను పట్టుకొని నాటకాలు ఆడుతున్నారని ఆమె ఆరోపించారు. నైనీ బొగ్గు టెండర్ విలువ దాదాపు రూ. 25 వేల కోట్లు అని, సింగరేణికి ఉన్న 19 ఓపెన్ కాస్ట్, 22 అండర్ గ్రౌండ్ మైన్లను నిర్వీర్యం చేసేలా కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

సింగరేణి సంస్థ ప్రయోజనాల దృష్ట్యా కవిత పలు కీలక డిమాండ్లు చేశారు. మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (MDO) విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ప్రైవేట్ కంపెనీలకు మైన్లను కట్టబెట్టడాన్ని ఆపాలని కోరారు. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్‌లో గ్రేడ్-9 బొగ్గు ఉన్నప్పటికీ, దానిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ధ్వజమెత్తారు.  తెలంగాణలోని అన్ని బొగ్గు ప్రాంతాలను సింగరేణికే కేటాయించాలని, కోల్ ఇండియా కంటే మెరుగైన వసతులు సింగరేణి కార్మికులకు కల్పించాలని డిమాండ్ చేశారు.

Read Also: BRS Party: బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం.. ఆ ఛానల్ బహిష్కరణ, అసలు కారణం అదే

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×