E-Paper
Advertisement

KCR: దళితబంధులో వెయ్యి కోట్ల అవినీతి!.. ఎమ్మెల్యేల పేర్లు అందుకే బయటపెట్టడం లేదా?

KCR: దళితబంధులో వెయ్యి కోట్ల అవినీతి!.. ఎమ్మెల్యేల పేర్లు అందుకే బయటపెట్టడం లేదా?

KCR Latest News(Telangana Politics): సీఎం కేసీఆర్ మాటలు తెలంగాణలో కాక రేపుతున్నాయి. దళితబంధు లబ్దిదారుల నుంచి కొందరు ఎమ్మెల్యేలు పైసా వసూల్ చేస్తున్నారంటూ.. వారి చిట్టా తన దగ్గర ఉందంటూ సంచలన కామెంట్లు చేశారు. ఆయా ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకపోతే.. టికెట్ కాదు కదా పార్టీ నుంచే వెళ్లగొడతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే చర్యలు ఎందుకు తీసుకోరంటూ దాడి చేస్తున్నాయి.

ఈ ఎపిసోడ్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల సైతం స్పందించారు. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. దళితబంధు పథకంలో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల జాబితా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చెప్పిన ప్రకారమే లెక్కిస్తే.. దళితబంధులో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. కమిషన్లు తిన్న ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేల పేర్లు బయటపెడితే.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని బయటపెడతారని భయపడుతున్నారా? అని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ అంటే కరప్షన్ చంద్రశేఖర్ రావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల.

Related News

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

Big Stories

×