E-Paper
Advertisement

KCR Letter: జూబ్లీహిల్స్ ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ.. అందులో ఏముందంటే..?

KCR Letter: జూబ్లీహిల్స్ ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ.. అందులో ఏముందంటే..?
Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ ఏసీపీ జారీ చేసిన నోటీసులపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఆరు పేజీల సుదీర్ఘ లేఖను ఏసీపీకి పంపారు. పోలీసులు వ్యవహరించిన తీరు చట్టవిరుద్ధమని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా నంది నగర్‌లోని తన నివాసం గోడకు నోటీసులు అతికించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

లేఖలో కేసీఆర్ ప్రధానంగా చట్టపరమైన అంశాలను ప్రస్తావించారు. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులను సెక్షన్ 160 CrPC ప్రకారం వారి నివాసం వద్దే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేశారు. తాను ప్రస్తుతం ఎర్రవల్లిలో నివసిస్తున్నానని, అక్కడికే నోటీసులు పంపాలని గతంలోనే కోరినప్పటికీ, పోలీసులు కావాలనే నంది నగర్ చిరునామాను వాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్‌లోని చిరునామాకు, విచారణ నోటీసులకు సంబంధం లేదని అన్నారు. విచారణ సమయంలో వ్యక్తి ఎక్కడ ఉంటున్నారనేదే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. హరీష్ రావు విషయంలో ఒకలా, తన విషయంలో మరోలా పోలీసులు ‘డబుల్ స్టాండర్డ్స్’ పాటిస్తున్నారని విమర్శించారు.

Advertisement

సుప్రీంకోర్టు గతంలో ‘సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ’ కేసులో ఇచ్చిన తీర్పును కేసీఆర్ ఈ లేఖలో ఉటంకించారు. నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలని, గోడలకు అతికించడం లేదా ఇతర పద్ధతులు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని హెచ్చరించారు. అంతేకాకుండా, జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని, చట్టపరంగా ఆ నోటీసులను తాను విస్మరించవచ్చని కూడా పేర్కొన్నారు.

అయితే.. చట్టపరమైన లోపాలు ఎన్ని ఉన్నప్పటికీ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని కేసీఆర్ ప్రకటించారు. పోలీసులు పట్టుబట్టిన విధంగానే ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నంది నగర్ నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మాత్రం పద్ధతి మార్చుకోవాలని.. నోటీసులను ఎర్రవల్లి చిరునామాకే పంపాలని పోలీసులకు సూచించారు.

Advertisement

 ALSO READ: CM Revanth: హార్వర్డ్ వేదికగా తెలంగాణ రైజింగ్.. విద్యార్థులకు సీఎం రేవంత్ కీలక సందేశం

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు, ట్రీట్‌మెంట్ చేస్తున్న వైద్యులు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×