Himanshu Injury: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు (కేసీఆర్) గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రికి చేరుకున్నారు. జిమ్లో వర్కవుట్ చేస్తూ గాయపడిన తన మనవడు హిమాన్షును ఆయన పరామర్శించారు. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా ఆసుపత్రికి వెళ్లారు.
జిమ్లో ప్రమాదం.. ముక్కుకు గాయం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు నిన్న జిమ్లో వ్యాయామం చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు స్వల్ప గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు హిమాన్షుకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు.
Also Read: నల్లమల అడవుల్లో సంచలనం.. గుండ్లకమ్మ తీరంలో బయటపడ్డ.. 1800 ఏళ్ల నాటి రహస్యాలు!
ఆసుపత్రి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు
హిమాన్షుకు గాయమైందన్న విషయం తెలియగానే తండ్రి కేటీఆర్, బాబాయ్ హరీశ్ రావు వెంటనే ఆసుపత్రికి చేరుకుని వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మనవడిని చూసేందుకు కేసీఆర్ స్వయంగా ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు.
ఆందోళన అవసరం లేదన్న వైద్యులు
హిమాన్షుకు జరిగింది స్వల్ప గాయమేనని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు స్పష్టం చేశారు. కేసీఆర్ రాకతో ఏఐజీ ఆసుపత్రి పరిసరాల్లో బీఆర్ఎస్ నాయకులు, భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు.
AIG హాస్పిటల్కు చేరుకున్న కేసీఆర్
జిమ్లో గాయపడి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనవడు హిమాన్షును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు.#KCR #Himanshu #AIGHospital https://t.co/tayHptrrrC pic.twitter.com/oUHSnMcJpw
— BIG TV Breaking News (@bigtvtelugu) July 7, 2026