E-Paper
Advertisement

RevanthReddy : కర్ణాటకలో గెలిస్తే.. తెలంగాణలో అధికారం ఖాయం..!

RevanthReddy : కర్ణాటకలో గెలిస్తే.. తెలంగాణలో అధికారం ఖాయం..!
Advertisement

RevanthReddy : ప్రస్తుతం కర్నాటకలో ఎన్నికల సందడి నెలకొంది. ఆ రాష్ట్రంలో మే 10న పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అలాగే ప్రభుత్వం ఏర్పాటులో జేడీఎస్ కీలకంగా నిలిచే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ కు విజయావశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నాటక ఎన్నికలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణలో వచ్చినట్లేనని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాహుల్‌గాంధీపై అనర్హత వేటు, అదానీ వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయడం లాంటి అంశాలపై హైదరాబాద్ లో తెలంగాణ పీసీసీ సర్వసభ్య సమావేశం నిర్వహించి చర్చించింది. ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌ రావ్ ఠాక్రేతోపాటు పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈనెల 7న కులి కుతుబ్‌షా మైదానంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 8న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.

Advertisement

ఈనెల 10 నుంచి తిరిగి తన పాదయాత్ర మొదలవుతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో మిగిలిన నాలుగు అసెంబ్లీ స్థానాలతోపాటు మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో పాదయాత్ర చేస్తానని చెప్పారు. గజ్వేల్‌లో లక్షమందితో నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తామని వెల్లడించారు. పీసీసీ కార్యవర్గ సమావేశాలు ఇప్పటి వరకు 5 సార్లు జరిగాయని, సమావేశాలకురాని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను తొలగిస్తామని హెచ్చరించారు.

కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లే నేతల వివరాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. ఏప్రిల్‌ 25 నుంచి మే 6 వరకు కర్ణాటకలో ప్రచారానికి హాజరు కావాలని నాయకులను కోరారు. అక్కడ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం చాలా ముఖ్యమన్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌ గాంధీభవన్‌కు వచ్చి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిశారు. కర్ణాటక ప్రచారానికి తాను కూడా వస్తానని చెప్పారు. మరి కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందా..? తెలంగాణలోనూ అధికారంలోకి రావడం ఖాయమేనా..?

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×