E-Paper
Advertisement

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!
Advertisement

Maheshwar Reddy: స్వేచ్ఛ బ్యూరో : ధాన్యం కొనుగోలు అంశంపై తాను వాస్తవాలతో సహా ఒక్కడినే వస్తానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ మొత్తంతో కలిసి వస్తే.. వాస్తవాలేంటో నిరూపిస్తానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మైక్ దొరికితే సీఎం నోటికొచ్చిన అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పీసీసీ చీఫ్​ గా ఉన్న సమయంలో ప్రతి గింజ కొంటానని మాట్లాడి.. ఇప్పుడెందుకు కొనుగోలు చేయడంలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు అంకెలపై మాట్లాడే మాటలకు, చేతలకు పొంతన లేదని ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చివరి గింజ వరకు కొనకుంటే రైతులతో వచ్చి సీఎం ఇంటి ఎదుట కూర్చుంటామని ఏలేటి హెచ్చరించారు.

Advertisement

గింజలు సీఎం ఇంటి ఎదుట పోయాలా? లేదంటే గాంధీ భవన్ ఎదుట పోయాలా? అని నిలదీశారు. కాంగ్రెస్ కంటే.. గత ప్రభుత్వం ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. 1వ తేదీలోపు మొత్తం కొనుగోలు చేస్తామని అన్నారని, 3వ తేదీ వచ్చినా ఎందుకు కొనలేదని నిలదీశారు. రేవంత్ కు అధికారంలో కొనసాగే అర్హత లేదని ఫైరయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంపై తాను ఓపెన్ డిబేట్ కు సిద్ధమని, సీఎం, మంత్రులు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని ఏలేటి సవాల్ విసిరారు.

లక్ష ఇండ్ల నిర్మాణం ఎక్కడా జరగలేదన్నారు. గృహ నిర్మాణాలు ఎక్కడ చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర వాటతో మాత్రమే ఇండ్ల నిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు. లక్ష ఇళ్లకు డబ్బు ఇచ్చిన ఆధారాలు ఎక్కడా లేవన్నారు. కేంద్రం డబ్బులతో ఇల్లు కట్టి ఇందిరమ్మ అని పేరు పెట్టేందుకు సిగ్గుందా అని ఏలేటి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం పైసలు లేవని చెబుతోందని, మరి మూసీ, తమ్మిడిహెట్టికి ఎలా ఖర్చు చేస్తారని ఆయన ప్రశ్నించారు. తమ్మిడిహెట్టి నిర్మాణానికి అంతరాష్ట్ర పర్మిషన్ కోసం కేంద్రానికి దరఖాస్తు చేశారా? అని ప్రశ్నించారు. అసలు దీనికి ప్రణాళిక ఎక్కడ? సోర్స్ ఏంటి? డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావని ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిలదీశారు.

Advertisement

Also Read: పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Related News

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..సీయం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×