E-Paper
Advertisement

Khammam: పామాయిల్ రైతుల ఆందోళన.. పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్..

Khammam: పామాయిల్ రైతుల ఆందోళన.. పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్..

Khammam: ఖమ్మం జిల్లా వైరాలోని అంజనాపురంలో గత ప్రభుత్వ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆగమేఘాల శంకు స్థాపన చేశారు. గోద్రెజ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించేందుకు ఒప్పందం జరిగింది. అయితే ఫ్యాక్టరీ నిర్మాణానికి కావలసిన భూమిని గిరిజన, సన్న, చిన్నకారు రైతుల వద్ద నుంచి బలవంతంగా గుంజుకున్నారని రైతులు ఆందోళన చేశారు. జిల్లా అధికారులే బెదిరించి వంద ఎకరాలకు పైగా భూమిని తమ వద్ద నుంచి సేకరించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంగా ఒక్క ఎకరానికి రూ.25 లక్షలు వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. భూమిని ఇచ్చిన తర్వాత కేవలం రూ.20 లక్షలు మాత్రమే చెల్లించారని.. మిగిలిన రూ.5 లక్షలు చెల్లించడం లేదని రైతులు వాపోయారు. ఇదే విషయంపై కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అధికారులను సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదని.. ఇక చేసేది ఏమీ లేక అందోళన బాట పట్టామని రైతులు తెలిపారు.

Tags

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×