E-Paper
Advertisement

Cm Revanth Reddy: డైట్ ఛార్జీల పెంపుపై గురుకుల విద్యార్థుల హ‌ర్షం.. సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు!

Cm Revanth Reddy: డైట్ ఛార్జీల పెంపుపై గురుకుల విద్యార్థుల హ‌ర్షం.. సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు!
Advertisement

Cm Revanth Reddy: తెలంగాణ‌లో డైట్ ఛార్జీల‌ను పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డికి గురుకుల విద్యార్థులు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఖ‌మ్మం జిల్లా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గ గురుకుల పాఠశాల విద్యార్థులు నేడు స‌చివాల‌యంలో సీఎంను క‌లిశారు. ఈ సంధ‌ర్భంగా రేవంత్ రెడ్డి విద్యార్థుల‌తో కాసేపు స‌ర‌దాగా మాట్లాడారు. విద్యా రంగంలో చేపట్టిన సమూల మార్పులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతోనే డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని చెబుతూ విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.

Also read: నేను మామూలు హోం మంత్రిని కాదు.. మక్కెలు ఇరగ్గొట్టే హోం మంత్రిని

Advertisement

వ్య‌స‌నాల‌కు బానిసైతే జీవితాలు నాశ‌నం అవుతాయ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ సామాజిక బాధ్య‌త అల‌వ‌రుచుకోవాల‌న్నారు. ఎక్క‌డైనా మ‌త్తు పదార్థాలు కనిపిస్తే పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని తెలిపారు. చ‌దువుతో పాటు విద్యార్థులు క్రీడ‌ల్లోనూ రాణించాల‌ని సూచించారు. అందుకే విద్యార్థి, నిరుద్యోగుల‌కు నైపుణ్య శిక్ష‌ణ అందించ‌డం కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేస్తామ‌న్నారు. టాటా ఇనిస్టిట్యూట్ స‌హ‌కారంతో ఐటీఐల‌ను ఐటీసీలుగా మారుస్తున్నామ‌ని చెప్పారు.

సాంకేతిక నైపుణ్యంతో పాటూ ప్ర‌భుత్వం ఉద్యోగ భ‌ద్ర‌త‌ను కూడా కల్పిస్తుంద‌ని హామీ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరంలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర‌వాత విద్యా వ్య‌వ‌స్థ‌పై దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. యువ‌త‌కు స్కిల్స్ కోసం స్కిల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయ‌డంతో పాటూ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో టీచ‌ర్ల కొర‌త ఉండ‌టంతో ఇప్ప‌టికే డీఎస్సీ నోటిఫికేష‌న్ ద్వారా టీచ‌ర్ల నియామ‌కం సైతం వేగంగా చేప‌ట్టింది. ప్ర‌భుత్వం విద్యావ్య‌వ‌స్థ బ‌లోపేతంపై దృష్టి పెట్ట‌డంతో మేధావులు సైతం ప్ర‌శంసిస్తున్నారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×