E-Paper
Advertisement

Cm Revanth Reddy: డైట్ ఛార్జీల పెంపుపై గురుకుల విద్యార్థుల హ‌ర్షం.. సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు!

Cm Revanth Reddy: డైట్ ఛార్జీల పెంపుపై గురుకుల విద్యార్థుల హ‌ర్షం.. సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు!

Cm Revanth Reddy: తెలంగాణ‌లో డైట్ ఛార్జీల‌ను పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డికి గురుకుల విద్యార్థులు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఖ‌మ్మం జిల్లా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గ గురుకుల పాఠశాల విద్యార్థులు నేడు స‌చివాల‌యంలో సీఎంను క‌లిశారు. ఈ సంధ‌ర్భంగా రేవంత్ రెడ్డి విద్యార్థుల‌తో కాసేపు స‌ర‌దాగా మాట్లాడారు. విద్యా రంగంలో చేపట్టిన సమూల మార్పులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతోనే డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని చెబుతూ విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.

Also read: నేను మామూలు హోం మంత్రిని కాదు.. మక్కెలు ఇరగ్గొట్టే హోం మంత్రిని

వ్య‌స‌నాల‌కు బానిసైతే జీవితాలు నాశ‌నం అవుతాయ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ సామాజిక బాధ్య‌త అల‌వ‌రుచుకోవాల‌న్నారు. ఎక్క‌డైనా మ‌త్తు పదార్థాలు కనిపిస్తే పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని తెలిపారు. చ‌దువుతో పాటు విద్యార్థులు క్రీడ‌ల్లోనూ రాణించాల‌ని సూచించారు. అందుకే విద్యార్థి, నిరుద్యోగుల‌కు నైపుణ్య శిక్ష‌ణ అందించ‌డం కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేస్తామ‌న్నారు. టాటా ఇనిస్టిట్యూట్ స‌హ‌కారంతో ఐటీఐల‌ను ఐటీసీలుగా మారుస్తున్నామ‌ని చెప్పారు.

సాంకేతిక నైపుణ్యంతో పాటూ ప్ర‌భుత్వం ఉద్యోగ భ‌ద్ర‌త‌ను కూడా కల్పిస్తుంద‌ని హామీ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరంలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర‌వాత విద్యా వ్య‌వ‌స్థ‌పై దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. యువ‌త‌కు స్కిల్స్ కోసం స్కిల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయ‌డంతో పాటూ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో టీచ‌ర్ల కొర‌త ఉండ‌టంతో ఇప్ప‌టికే డీఎస్సీ నోటిఫికేష‌న్ ద్వారా టీచ‌ర్ల నియామ‌కం సైతం వేగంగా చేప‌ట్టింది. ప్ర‌భుత్వం విద్యావ్య‌వ‌స్థ బ‌లోపేతంపై దృష్టి పెట్ట‌డంతో మేధావులు సైతం ప్ర‌శంసిస్తున్నారు.

Related News

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

Big Stories

×