E-Paper
Advertisement

Congress: కోమటిరెడ్డికి కాంగ్రెస్ షాక్.. పొమ్మనలేక పొగ?

Congress: కోమటిరెడ్డికి కాంగ్రెస్ షాక్.. పొమ్మనలేక పొగ?

Congress: టీపీసీసీలో కీలక మార్పులు చేసింది హైకమాండ్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు అన్నిటికీ దాదాపు ఆమెదం లభించింది. ఎప్పుడూ ఆ పాత విధానమేనా? ఇప్పుడు ట్రెండ్ మారింది. టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా పోరాడాలంటే.. కాంగ్రెస్ కొత్త జవసత్వాలు సంతరించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే, డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా, పార్టీ అధిష్టానం టీపీసీసీలో కొత్త కమిటీలు ఏర్పాటు చేసింది.

18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ.. 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ.. 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది ఏఐసీసీ. ఇక, జగ్గారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్, మహేష్ గౌడ్ లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. అయితే, టికాంగ్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు ఎందులోనూ లేకపోవడం ఆసక్తికరం.

పీసీసీ చీఫ్ పదవికే పోటీపడి.. రేవంత్ రెడ్డిని పదే పదే విమర్శించి.. రేవంత్ ను ఎలాగైనా పీసీసీ పీఠం నుంచి దించేయాలని చూస్తున్న వెంకట్ రెడ్డి పేరు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో లేకపోవడం ఆయనకు బిగ్ షాక్. మునుగోడు ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ కాంగ్రెస్ నేతకు ఫోన్ చేసి.. బీజేపీ అభ్యర్థి, తన సోదరుడైన రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని పిలుపు ఇవ్వడంపై అధిష్టానం సీరియస్ గా స్పందించింది. వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. ఆ వాయిస్ తనది కాదంటూ ఆయన వివరణ కూడా ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకైతే క్రమశిక్షణ కమిటీ నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఇలా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో ఒంటరివాడయ్యారు. తాజాగా ప్రకటించిన కమిటీల్లోనూ ఆయన పేరు లేకపోవడం.. ఒకవిధంగా పొమ్మనేలా పొగబెట్టడమే..అంటున్నారు. సీనియర్ నేతను వెళ్లగొట్టలేక.. ఆయనే వెళ్లిపోయేలా.. పక్కన పెట్టేశారని చెబుతున్నారు. మరి, కోమటిరెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో..?

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×