E-Paper
Advertisement

Komatireddy Venkat Reddy: నల్గొండ అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి మార్క్.. మూడేళ్లలో జాతీయ అవార్డే లక్ష్యం!

Komatireddy Venkat Reddy: నల్గొండ అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి మార్క్.. మూడేళ్లలో జాతీయ అవార్డే లక్ష్యం!
Advertisement

Komatireddy Venkat Reddy: నల్గొండలో జరిగిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నగర కార్పొరేషన్ పరిధిలోని 48 మంది కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కౌన్సిల్‌లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ఎంఐఎం (MIM) పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకు నిబద్ధతతో సేవ చేయాలని కార్పొరేటర్లకు సూచించారు. ఏ సమస్య వచ్చినా మేయర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర రెడ్డి మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని అన్నారు. పెద్దవాళ్లు తినే బియ్యమే ఈ రోజు పేదలకు అందుతోందని.. ప్రభుత్వం 5 వేల కోట్లు ఉచిత కరెంటు బిల్లుల కోసం చెల్లించిందని వివరించారు. ఒక్కో కుటుంబానికి సుమారు 50 వేల రూపాయల భారం తగ్గించామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని.. ప్రముఖ వైద్యుడు డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి సహకారంతో నల్గొండలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

Advertisement

గతంలో ఎంపీగా ఉన్న పరిచయాలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. నగరం దెబ్బతినకుండా 700 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్ నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి అభివృద్ధి కోసం పనిచేయాలని.. మూడేళ్లలో నల్గొండ కార్పొరేషన్ జాతీయ అవార్డు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. నగరంలో తాగునీటి వ్యవస్థ సరిగా లేదని గుర్తుచేస్తూ.. వెంటనే నీటి సరఫరా మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. ఎవరికైనా సమస్య ఉంటే తాను అండగా ఉంటానని మంత్రి స్పష్టం చేశారు.

Also Read: తెలంగాణ జాగృతిలోకి కావేటి మనోహర్.. కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత

Related News

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Big Stories

Advertisement
×