Komatireddy : పుష్పా సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఆయన.. శ్రీతేజ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ కేసులో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రస్తుమం.. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని దగ్గరకు వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి రూ.25 లక్షల చెక్కును శ్రీతేజ తండ్రికి అందించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని ప్రకటించారు.
ప్రస్తుతానికి బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా కిమ్స్ లో ప్రత్యేక చికిత్స పొందుతున్న ఈ బాలుడిని చూసిన కోమటిరెడ్డి.. శ్రీ తేజ ఆరోగ్యం తొందరగా మెరుగవ్వాలని, కోలుకుని తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో చర్చించానని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి.. 30 ఏళ్లుగా ఎమ్మెల్యే గా ఉన్న తనకు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి చుస్తే భయమేస్తోందని వ్యాఖ్యానించారు. శ్రీతేజ పూర్తిగా కోలుకోవడానికి 1, 2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు.. కోలుకున్నా మాటలు వస్తాయో రావో తెలియదని తెలిపారు.
శ్రీతేజ తండ్రి భాస్కర్ కు ధైర్యం చెప్పిన కోమటిరెడ్డి.. అతని ఇద్దరు పిల్లల చదువు కోసం కూడా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సహాయం అందజేస్తామని ప్రకటించారు. హీరో అల్లు అర్జున్ పై కేసు దర్యాప్తు జరుగుతుందన్న కోమటి రెడ్డి.. కోర్టు పరిధిలోని అంశంపై తాను మాట్లాడనని తెలిపారు. శ్రీతేజ మెరుగైన ఆరోగ్యం కోసం.. అవసరమైతే అమెరికా నుంచి మెడిసిన్ తెప్పిస్తామని ప్రకటించారు.
ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోస్ ఉండవని ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి.. రాష్ట్రంలో పుష్పా 2 తో బెనిఫిట్ షోలు ఆపేస్తున్నట్లు ప్రకటించారు. పుష్పా 2 నేను కూడా చూసానన్న కోమటిరెడ్డి.. ఇకపై తెలుగు సినిమాలు చూడనని ప్రకటించారు. ఆ మూడు గంటలు