E-Paper
Advertisement

KTR: విచారణకు దమ్ముందా? మోదీకి కేటీఆర్ సవాల్.. ప్రధాని-అదానీలపై ఫైర్

KTR: విచారణకు దమ్ముందా? మోదీకి కేటీఆర్ సవాల్.. ప్రధాని-అదానీలపై ఫైర్
Advertisement

KTR: ఎప్పుడూ సాఫ్ట్‌గా, నైస్‌గా మాట్లాడే కేటీఆర్.. ప్రెస్‌మీట్‌లో ఉగ్రరూపం ప్రదర్శించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై.. మోదీని తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. రాజకీయపరమైన కేసులను రాజకీయంగానే ఎదుర్కొంటామని.. మోదీ ఉడతఊపులకు భయపడేది లేదన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని.. చివరకు న్యాయమే గెలుస్తుందని చెప్పారు. కవిత తర్వాత కూడా దర్యాప్తు సంస్థల వేధింపులు ఉంటాయని.. బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజల ముందు ఎండగడతామని మండిపడ్డారు కేటీఆర్.

లిక్కర్ స్కామ్‌లో విచారణ ఎదుర్కొనేందుకు మాకు దమ్ముంది? అదానీ విషయంలో విచారణ ఫేస్ చేసేందుకు మోదీకి దమ్ముందా? అంటూ నిలదీశారు కేటీఆర్. అదానీ, మోదీల బంధంపై లై డిటెక్టర్ టెస్ట్‌కు ప్రధాని సిద్ధమా? ఫాంహౌజ్ కేసులో విచారణకు బీఎల్ సంతోష్ రెడీనా? అని ప్రశ్నించారు.

Advertisement

లిక్కర్ పాలసీ స్కామ్ అయితే.. అదానీ కోసం అనేక నిబంధనలు మార్చేయడం స్కామ్ కాదా? అంటూ పలు విషయాలను వెల్లడించారు. గుజరాత్‌లో మద్య నిషేధం ఉన్నా కూడా.. లిక్కర్ తాగి 42 మంది ప్రజలు చనిపోవడం పెద్ద స్కామ్ అన్నారు.

నిబంధనల ప్రకారం ఒక సంస్థకు రెండు పోర్టులకే అనుమతి ఉండగా.. ఆ రూల్ మార్చేసి అదానీకి దేశంలోని ఆరు పోర్టులు కట్టబెట్టడం అసలైన స్కామ్ అన్నారు.

Advertisement

గంగవరం, కృష్ణపట్నం పోర్టులు లాక్కొని అదానీకి ఇవ్వడం స్కామ్.. ముంబై ఎయిర్‌పోర్టును అదానీ చేతిలో పెట్టడం స్కామ్.. అదానీ పోర్టులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికినా విచారణ జరపకపోవడం స్కామ్.. దేశంలో బొగ్గు చీప్‌గా దొరుకుతున్నా, ఆస్ట్రేలియాలోని అదానీ కంపెనీ నుంచే బొగ్గు కొనాలంటూ పాలసీ తీసుకురావడం స్కామ్.. అంటూ మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని కడిగిపారేశారు కేటీఆర్.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×