BigTV English

KTR: మాట మార్చిన కేటీఆర్.. చివరి వరకు ఆయనే? కొత్త రాగం వెనక కథేంటి ?

KTR: మాట మార్చిన కేటీఆర్.. చివరి వరకు ఆయనే? కొత్త రాగం వెనక కథేంటి ?

KTR: కేటీఆర్ టెన్షన్ పడుతున్నారా? ఫార్ములా ఈ కేసు విచారణను తప్పించుకు నేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇంకోవైపు పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? పార్టీలో జరుగుతున్న లుకలుకలపై ఇంటాబయటా చర్చ తీవ్రమయ్యిందా? ఓ వైపు కవిత, మరోవైపు కేటీఆర్ కాబోయే సీఎం అనే ప్రచారానికి బ్రేక్ వేసేందుకు ట్రై చేస్తుందా? వాటిని డైవర్ట్ చేసే పనిలో పడ్డారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య డైవర్ట్ పాలిటిక్స్. మీడియా అడిగే ప్రశ్నలకు తప్పించుకునేందుకు ఎదుటివారిపై బురద జల్లడం కామన్‌గా మారింది. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతోంది. ఫార్ములా ఈ కారు రేస్ కేసు నమోదుతో కేటీఆర్ ఇమేజ్ అమాంతంగా పడిపోయిందన్నది నేతల మాట. విచారణకు హాజరై మరింత దారుణంగా ఉంటుందని గమనించారాయన. ఈ క్రమంలో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఫార్ములా కేసులో తొలిసారి ఏసీబీ ముందు విచారణకు హారవుతున్నారు కేటీఆర్. ఆయన కచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచారణకు వెళ్లకుంటే దాన్ని షాకుగా చూపించి న్యాయస్థానంలో బెయిల్ రద్దు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ ముందు హాజరవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు పార్టీ నుంచి కొత్త పల్లవి ఎత్తుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టాలని ప్లాన్ చేసినట్టు పార్టీ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.


ఇదిలావుండగా శనివారం మీడియా ముందుకొచ్చిన కేటీఆర్.. మనసులో ఏ ముందో చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేవారు. ఆ తర్వాత వివిధ ఛానెళ్లతో మాట్లాడారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలపై మీడియా ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. పనికిమాలిన వారు ఇలాంటి స్లోగన్స్ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తామంతా పని చేస్తున్నామన్నారు. చివరి వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పకనే చెప్పేశారు. కేసీఆర్ మీ నాయకుడు అన్నప్పుడు.. అసెంబ్లీకి ఎప్పుడు వస్తున్నారు అనే ప్రశ్నకు సరిగా సమాధానం ఇవ్వలేదు.

ALSO READ: ఐఐటి ఇందోర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య.. ఆ వ్యసనంతోనే?

బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుందన్నది వాదన మరింత బలపడింది. ఈ మధ్యకాలం లో కేటీఆర్ మాటలు సరిగా లేవన్నది కొందరి మాట.  ఒకప్పుడు హుందాగా ప్రవర్తించే వారని, ఇప్పుడదేమీ కనిపించలేదని అంటున్నారు. గతంలో పొరుగు రాష్ట్రం ఏపీలో వైసీపీ నేతలు ఇలాగే మాట్లాడేవారని, దాన్ని ఫాలో అవుతున్నారా? అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పడిపోతున్నాయి.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×