E-Paper
Advertisement

KTR: కాంగ్రెస్ రెండేళ్ల పాలన.. ప్రజల దృష్టి మళ్లించడమే లక్ష్యం.. కేసీఆర్ విచారణపై కేటీఆర్ ఘాటు స్పందన.. 

KTR: కాంగ్రెస్ రెండేళ్ల పాలన.. ప్రజల దృష్టి మళ్లించడమే లక్ష్యం.. కేసీఆర్ విచారణపై కేటీఆర్ ఘాటు స్పందన.. 
Advertisement

KTR: కేసీఆర్ విచారణ ముగిసిన అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ఆయన మూడు ముక్కల్లో “డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్” (Diversion, Subversion, Perversion) అని అభివర్ణించారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, నీచమైన రాజకీయాలకు పాల్పడటమే ఈ ప్రభుత్వ పనితీరుగా మారిందని ఆయన మండిపడ్డారు.

కేంద్ర బడ్జెట్ 2026లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఉద్దేశపూర్వకంగా నేడు కేసీఆర్ విచారణను తెరపైకి తెచ్చారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రం నుండి 8+8 మంది బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి దక్కింది గుండు సున్నా అని, ఈ వైఫల్యంపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ‘ఫోకస్ షిఫ్ట్’ కోసం ఆదివారం పూట విచారణ నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు. సిట్ (SIT) అధికారులు చట్టాన్ని, నిబంధనలను గౌరవించకపోయినా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న బాధ్యత గల నేతగా కేసీఆర్ పూర్తిస్థాయిలో సహకరించారని, ప్రతి ప్రశ్నకూ కుండబద్దలు కొట్టినట్లు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.

Advertisement

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు జరుగుతున్నా, గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. సమ్మక్క-సారక్క జాతరలో భక్తులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం విదేశీ విహారయాత్రల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా ఈ ‘లింకులు-లీకులు’ రాజకీయాలు ఆపి, బడ్జెట్‌లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించాలని, దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also: Phone Tapping Case: కేసీఆర్ విచారణలో పార్ట్-1 కంప్లీట్.. మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా?

Related News

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Big Stories

Advertisement
×